పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శబ్దంబులును దిక్కులు పిక్కటిల్ల భూతలంబున రక్తంబు
వెల్లువలై పాఱె. తత్సమయంబున జ్వాలాముఖుండు చక్ర
రాజేంద్రునకు జరుగుచుండు కయ్యం బెఱింగింప నాతఁ
డత్యంతకోపావేశుఁడై త్రిపురాంతకుండైన కాలరుద్రుం
బోలె నేనూఱుకరంబుల నేనూఱుకార్ముఖంబులు ధరించి
తక్కిన యేనూఱుకరంబులఁ జండకాండకాండంబులం గొని
ప్రత్యాలీఢపాదుఁడై నిలిచి ధనుర్జ్యాఘోషం బొనరించి
శాత్రవనికరంబునందుఁ బ్రయోగింపఁ గడుపులు చీలియు
నడుగులు తెగియుఁ దలలు పగిలియుఁ జేతులు తునిఁగియు
నిట్లు చిందఱవందఱ యగుటం జేసి చోరనాయకులు జడిసి
పఱతెంచి తమదుర్గంబుల డాఁగి రంత.

13


ఆ.

చలము విడక యపుడు చక్రరాజేంద్రుఁ డా
గ్నేయనామ మొప్పు సాయకంబు
మింటఁ గూర్చి వైవ విపినంబులం గాల్చు
చరిగి చోరచయము నవనిఁ బడఁగ.

14


వ.

కూల్చి భస్మంబు సేయం బుడమి నవ్వేఁడికిఁ బొగలుచుండె
నంత నమితవృష్టి గుఱియించి యాభూతలంబును శీతలంబును
గావించి ధర్మాధ్యక్షుండనువాని నమ్మహీస్థలికి రాజుగఁ జేసి
ధర్మమార్గంబున నెల్లజనులను బరిపాలించుమని యానతి
యిచ్చి యనంతరంబున.

15


సీ.

చతురంగబలములు మితిమీఱఁ గొల్వఁగ
        ధీరుఁడై దక్షిణదిక్కు కరిగి
వనదుర్గములయందు వారక వెదుకుచుఁ
        జిక్కినచోరులఁ జక్కఁబఱచి