పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

111


నని రాజులం జూచి యవనీశులార! మీ
        రేఁడాది కొకసారి యిచటఁ జేరి
బంధుమిత్రులతోడ వైభవంబులతోడ
        సేవల నొనరించి చిత్తవృత్తి


తే.

 దార్ఢ్యముగ మీకుఁ గల్గిన ధనమునందు
నాలుగవపాలు గొనితెచ్చి నాకు నొసఁగి
వేడుకలు సేయుచుండుఁడు విభవ మొంద
నిరతమును మీ రటంచును నెమ్మిఁ బల్కె.

126


వ.

అని యిట్లు చాతుర్వర్జ్యములవారికిం దగినధర్మంబు లుపదే
శించి వస్త్రభూషణాదులు సన్నిధానంబుననుండి పారితోషి
కంబు లిప్పించి స్వస్థలంబులకుఁ బోనియమించిన వారంద
ఱాహరిచరణారవిందంబులకుఁ బ్రణమిల్లి యవ్వేంకటా
చలంబు డిగ్గి తమ నెలవులకుం జనిరి. అనంతరం బాబ్రహ్మాది
దేవతలం జూచి శ్రీహరి వెండియు నిట్లనియె.

127


సీ.

బ్రహ్మాదులార! నా పల్కులు మఱికొన్ని
        యాలకింపుఁడు వేంకటాద్రియందు
ధరణీసురుల కన్నదానంబు చేసిన
        నేఁ దృప్తిఁ బొంది మన్నింతు వారి
నదిగాక సకలవిద్యాదానములు చేయు
        వారును మఱి వారివంశజులును
వారివంశజులును వారివంశజులును
        బుణ్యలోకంబును బొందుచుంద్రు


తే.

తులసివనములు నిర్మించి తొడరి తద్ద
ళముల నాకర్పణముసేయ లలితసౌఖ్య