పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


స్తరభసఘోరవారినిధి దాఁటి సుఖంతురు వారి నెల్ల నేఁ
గరుణను బ్రోచుచుండుదును గంజభవా యిది నమ్ము నీమదిన్.

122


శా.

నారూపంబు మనంబునం దలంచుచు న్నానామము ల్బాడుచున్
వేరేచింతలు లేక నాయెడఁ గడు న్విశ్వాసము న్నిల్పుచున్
శ్రీరమ్యం బగుభక్తిఁ జేసి నను నర్చింపంగ శాస్త్రోక్తిచే
నారూఢిం దగు పూజ సేయుజనులం దాసక్తి నే నుండెదన్.

123


సీ.

వారి యాపదలెల్ల వారించి ప్రియముగ
        వారు కోరినయట్లు వరము లిత్తు
ధనవస్తుసంతాన ధాన్యరత్నాదుల
        ననుపమభోగభాగ్యముల నిత్తు
నాయందు ననిశంబుఁ బాయని భక్తులౌ
        జనులకుఁ దోడ్పడి గనుచునుందు
నెంతనమ్మినవారి కంతఫలం బిత్తు
        నమ్మనివారికి నెమ్మి నొసఁగ


తే.

ననిశమును నన్ను మది నిల్పి యాడుజనుల
కిత్తు మోక్షంబు మఱి యెవరేని యిందు
నఖిలదానంబు లతిభక్తి నరసి పేద
వాండ్ర కిచ్చినచో వారి వఱలఁ గాతు.

124


వ.

అని పల్కి రుద్రేంద్రాదులం జూచి యిట్లనియె.

125


సీ.

అరయఁ గన్యారాశి కర్కుండు వచ్చిన
        యదను శ్రీయుత్సవం బాచరింప
వలయు మీ రెల్లరు వచ్చి వేడుక మీఱఁ
        బ్రతివత్సరంబును బాగుమెఱయ