పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

109


తే.

శంకరుం డజుఁ డియ్యది సత్యమంచు
బల్కి రటుమీఁద సకలవైభవము లెసఁగ
శ్రీనివాసుడు కోవెలఁ జెంది యచటఁ
బొసఁగఁ గల్యాణమంటపంబున వసించె.

119


వ.

మఱియు విఖనసప్రముఖులు ప్రసూనయాగ నిత్యకృత్యంబు
లొనరించి పత్నీసమేతంబుగ శ్రీపతిని విమానప్రదక్షిణంబు
సేయించి క్రమ్మఱ నిజస్థానంబునం దుంచి బ్రహ్మాది దిగ్దేవతా
బలియు నుద్వాసనంబును ధ్వజారోహణంబు నంకురాక్షతా
రోపణంబును సంపూర్ణహోమంబును గలశోద్వాసనంబును
శ్రీస్వామియందుఁ బ్రధానకలశావాహనంబును గావించి
రప్పుడు, శ్రీనివాసుండు విఖనసునకు బహుమానం బొసంగి
కసకరత్నమయం బగు సభామంటపంబునందు శ్రీభూ నీళా
సమేతంబుగ సకల దివ్యభూషణ కనకాంబర గంధోపేత
కుసుమదామాలంకృతుఁడై బ్రహ్మరుద్రేంద్ర ముని యోగీ
శ్వరప్రముఖులును సకలదేశాధీశ్వరు లైన రాజులును పరి
వేష్టించి కొలువ సకల వైభవంబు లంగీకరించుచుఁ గర
దీపికా సహస్రంబులు ప్రకాశింప హేమసింహాసనాసీనుం డై
కొలువుండి బ్రహ్మను జూచి సంతసంబున నిట్లనియె.

120


క.

కమలజ నీసంకల్పము
క్రమముగ ఫలియించె మోదకలితుఁడ నైతిన్
సుమహితముగ నీయుత్సవ
మమరఁగ బ్రహోత్సవాఖ్య మవని న్వెలయున్.

121


చ.

స్థిరమతితోడ నీవిచటఁ జేసినయట్టి రథోత్సవంబు భా
స్వరమగు భక్తి నిచ్చటికి వచ్చుచుఁ జూచుచు నుండువారు దు