పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


స్థానమునందు నిలిచె నంత శ్రీవేంకటాద్రీశుండు భూనీళా
సమేతంబుగ రథంబు డిగ్గి బ్రహ్మరుద్రాదులతోడఁ గల్యాణ
మంటపంబునందుఁ బ్రవేశించి నిత్యహోమాది కృత్యంబు
లొనర్చి సకల దేవగణంబులచేతఁ బూజితుం డై ధ్వజారోహ
ణంబు మొదలుకొని యారగించినరీతి నానావిధభక్ష్య
భోజ్యంబులం బరితృప్తి నొందినవాఁ డయ్యె. అంత బ్రహ్మా
దులు నారగించి పరితృప్తి నొంది హరిని యుచ్చైశ్శ్రవంబున
నుంచి విమానప్రదక్షిణంబు సేయించి కళ్యాణమంటపంబున
నునిచి వేడ్కల నలరించి యథాస్థానంబున నుంచి చూర్ణాభి
షేకంబు సేయించి క్రమ్మఱుఁ జక్రతాళ్వారును హరిని శ్రీ
భూమి నీళలను దిరుచయందు విమానప్రదక్షిణంబుగ
స్వామిపుష్కరిణీతీరంబున వేంచేపు సేయించి వరాహస్వామి
ముందట మంటపంబున నునిచి పంచామృతస్నానాది తిరు
మంజనంబును జక్రస్థాన నైవేద్య క్రమంబుల నాచరించి
బ్రహ్మాదు లవభృథస్నానంబులు సేసి రప్పుడు హరి వారలం
జూచి కరం బెత్తి యిట్లనియె.

118


సీ.

బ్రహ్మ రుద్రాది దిక్పాలకు లందఱు
        నామాట వినుఁడు నిర్ణయముగాను
శ్రవణోడునందుఁ జక్రంబుతోఁ గూడ నా
        స్వామిపుష్కరిణిలో స్నానములను
సల్పువారలు పూర్వజన్మంబులను జేయు
        పాపంబులను బాసి భాగ్యవంతు
లై యిహపరములయందు సుఖింతురు
        నామాట నిజముగ నమ్ముఁ డనిన