తృతీయాశ్వాసము
41
మ. అన నయ్యోగ్యుఁడు చేరవచ్చి మునినాథా యీతపం బేల నీ
కన నారాయణుఁ జూడ జనా నన్నమది నే యర్థంబు గామించినా
వన మోక్షార్థిని మీఱ లెవ్వరన నే నాచార్యులందెల్ల పె
ద్దను నీసేమముఁ గోరి వచ్చితిఁ జుమీ దైవానుకూలంబుగన్.
గీ. అనినవిని యస్మదభ్యుదయార్థి నగుచు, వచ్చితి నటన్న నీమాటవైపు జూడ
మనుజుఁడవు కావు ననుఁ బ్రోతువనితలంతు, నాదినారాయణుఁడవు తథ్యంబు సుమ్ము.
క. వీరెవ్వ రాజినాంబర, ధారులు మీయాకృతికిని దగుశిష్యులు ని
ట్లేరీతి గూర్చితిరి మీ , పేరును దలిదండ్రులెవరొ బేర్కొనుఁ డనుడున్.
సీ. ఎట్టిపేరనువాఁడ యెల్లపేరులు నావి గురుఁ డెవ్వ డందును గురుఁడ నేను
యెందునుండుదునందు నెల్లచోటులనుందు నెవ్వారు తలిదండ్రు లెఱుఁగ నేను
యిది జాతిపుట్టుక యిదియనఁగా లేదు నాకు జుట్టంబు లేనాట లేరు
కాన నెన్నఁడు నార్తిగలయార్తులను బ్రోతు నేను నమ్మినవానిఁగాని జేర
కారణము లేని శిష్యులు వీరు నాకు, జూతునని నన్ను నెవ్వరుఁ జూడలేరు
కోరినను వారికిత్తును గోర్కెలెల్ల, వత్తు వలసినయెడ కిందు వచ్చినటుల.
క. నానాసుపర్వులందును, మౌనులను సనత్కుమారమౌనియు పరమ
జ్ఞానాధికుఁ డుత్తముఁడన, నే నెప్పుడు వినుచు నునికి నిటు రావలసెన్.
గీ. నన్ను మీరెవ్వరని వేడినావు కొన్ని, యభ్యసించి యుపాధ్యాయులైనద్విజులు
సకలమును నేర్తు గావున జగతి గురుల, కెల్లనుఁ బ్రధానగురుఁడని యెరుఁగు మనఘ.
క. దీనికి నిదర్శనంబుగ, మానసమున దెలియఁదగిన మర్మంబులు నీ
చే నడిగి తెలుతుననుచు ర, మానాయకుఁ డా సనత్కుమారున కనియెన్.
సీ. జనులెల్ల జయపెట్టఁజను నర్థ మదియెద్ది మనుజులాడెడియట్టి మాటయెద్ది
యందఱకును దృష్టియనియెడు పలుకెద్ది నొక్కటై బహుళమై యుండునెద్ది
యాధారరూప మౌ నది యెద్ది విను పుట్టునెద్ది పుట్టకయుండునెద్ది తలఁప
సత్తునసత్తునా జనియె నెద్ది జలంబు బహుజన్మమెద్ది నాప్రశ్న లెఱిఁగి
వరుసగా నేర్పరుపుమన్న వాక్యములకు, నెరుసుగా ననుఁ బ్రోవఁగ నెంచి యిటకు
జేరు నారాయణుఁడ వీవు వేరు సేయ, నేల మీ రానతిండన నిట్టులనియె.
క. నీతపముచేత నొగిలెన్, భూతలమని యెల్లవేలుపులు మొరయిడ నే
నీతీరున వచ్చితి విను, నాతలఁచిన ప్రశ్నములకు నాయుత్తరముల్.
సీ. జనులు స్వధర్మానుసారంబు సేయుట యనృతంబు దొరలనియదియె మాట
సూర్యుఁ డందఱకుఁ జక్షువునాగ విలసిల్లు ప్రకృతి యొక్కటియేని పలుకఁబడియె.