Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 75 దీని తరువాతగూడ నీవంశమభివృద్ధి చెందినది. కాని దానిలో మనకిటఁ బస_లేదు. చాళుక్యులకు రణాధి దేవతయు పాణ్మాతురుఁడునగు శా_ర్తికే యుఁడును, ఆదిశక్తులైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి , ఇందాణిచామ cడ, యను"సప్తమాతృకలును గులదైవతము ಸೆಲ್ಲು కుజ్ఞష్ణువర్ధనుని సలె” గా గౌసనమువలనఁ దెలియవచ్చుచున్నది. నందంపూడి శాసనమందుఁగూడ “మాతృగణ పరిపాలితానాం, స్వా మిముహ8 సేన పాదానుధ్యాతానాం" అని యుదాహరింపఁ బడియున్నది" ఈ చాళుక్యవంశపు రాజు లాంధదేశములోఁ జాలభాగమును దాదాపు నైదువందల సంవత్సగములు బరిపాలించియుండుటచే వారిచారిత) మును క్లుప్తముగ నీదిగువ వాయుచున్నాఁడను. నన్నయభట్టారక కవి చారితములో నీరాజవంశవర్ణనమున కంత7గా సంబంధము లేకపోయినను, ఆంధ దేశ పరిపాలనములో సంబంధించినదగుటచేతను, వారు భారతకృ తిపతికిఁ బూర్వులగుటవలనను వారిచారితమును గొంచెమిటఁ జెప్పఁ దల చితిని, ఆ రాజుల చారితముల నిందుఁ బూర్తిగఁ దెలుపు టనావ శ్యకము కావున, లోపవ్యత్యాసములను బాటింపక దిజ్మాతసూచకముగ వాని నిఁట వాయుచున్నాఁడను, ఆయానృపాలురు వాయించిన శిలాతామశాసనములనుగూర్చి కూడ యొక్కించుక సూచించితినేని జిజ్ఞాసువు లాశాసనములను జదువు కొని యూ కాలవునాఁటి పరిస్థితు లను దెలిసికొనవీలగునసి తలంచి యతి క్లుప్తముగ నాశాసన విషయములను గూడ నుదాహరించుచున్నాఁడను ౧. కుబ్జ విష్ణువర్ధనుఁడు;—ఇతనికి విషమసిద్ధి యనియు, మక రధ్వజుఁ డనియు బిరుదములు కలవు, విషమదుర్లములను సాధించుటచే విషమసిద్ధి యనియు, అనే కాగ్రహారముల నొసంగిన మహా దాతయగు