యేకాంగవీరుండును నవలక్షతెలుంగు మిన్నండును,[1] బంచపాండ్యదళవిభా
ళుండును, రాయవేశ్యాభుజంగుండును, సర్వబిరుదురజగనొబ్బగండ సంగ్రామ
ధనంజయుండును,[2] ముప్పదిరెండుదుర్గవిభాళుండును, నేకధాటి విషమధాటి
సమర్థుండును,[3] మూరురాయరగండపెండేరంబు[4] డాకాలఁ బెట్టిన త్రిభువనీ
రాయరావన్నఁడని యెఱుంగక జల్లిపల్లివీరక్షేత్రంబున శార్వరి కార్తిక శుద్ధ
పక్షంబునందు నెదిరించిన యాఱువేల గుఱ్ఱంబులు నేడునూఱుల[5] మత్తే
భంబులు, నిరువదివేల కాలుబలంబులతో రాజుల కెదురు నడచి, తన హిత
పరిజనంబులు హంకారమానుషభీమభార్గవులైన పదివేల పద్మజులకును[6],
రణభయభంగవర్జితులైన తెలుంగలకును, గర్పూరతాంబూలాదు లొసంగి
రణోత్సాహులై, వీరరసము చిప్పిల, వీరహాహాకారంబులు వీరతమటంబులు,[7]
వీరభేరీరవంబు మ్రోయ[8] బడినాయంకులు, లెంకలు, సముఖపుఁ జనవరుల
కును,[9] బిరుదురాహుత్తులు మొదలైనవారికి బహుమానంబుఁ జేసి, కొని
యాడి నడచి తలపడి ఖండవిఖండశతఖండతుండంబులుగా నఱికి యట్ట
లాడించి, కొండమల్రాజు మొదలగు రాజుల[10] రణంబులోఁ జంపి, హత
శేషులు జల్లిపల్లికోటఁ జొచ్చినఁ గోట నెక్కి నూటొక్కరాజుల శిరంబులు
ఖండించి యేఁబది[11]యొక్క రాజులఁ గలుగాన్గ లాడించి, మఱియు ముప్పది
ముగ్గురు[12] రాజులఁ బట్టి పూజించి రణబలిగాఁ దెచ్చి యారణక్షోణి
నర్చించి[13] దిగంబరీ, కాళీ, మహాకాళీ,[14] శాకినీ, ఢాకినీ, బాయిళాకాయినీ
భూతప్రేతపిశాచంబులఁ దలఁచి, ‘రణదేవరా, మహారణరాజా, రణశూరా,