తృతీయాశ్వాసము 55
గవనికాపులవారు దిక్పాలవరులు
దక్షవాటికి భీమేశుధామమునకు. 88
వ. అని ప్రసంగించి శివలింగార్చనాపరాయణుండైన మైత్రావరుణుండు త్రిలింగవిషయమంగళాలంకారంబగు భీమేశ్వరమండలంబునఁ బండ్రెండుశివలింగస్థానంబులు వివరించువాఁడై యిట్లనియె. 89
తే. ఉత్సవం బుత్సవము దప్పకుండ సురలు, వత్తు రౌత్సుక్యమున దక్షవాటమునకు
శాంభవీశక్తి మర్త్యవేషంబు దాల్చి, భీమలింగంబుఁ ద్రిభువనస్వామిఁ గొలువ. 90
క. తాండవమాడుఁ గుమారశి, ఖండి మహోత్సవమువేళ గంభీరములై
డిండిమనిర్ఘోషంబులు, పండువుపండువున నుఱుముభంగి వహింపన్. 91
తే. మర్త్యభామలు విబుధభామలును గలసి
యుత్సవములందు వర్తించుచున్నయపుడు
దక్షవాటంబు వీట భదంబు దెలియు
దృఙ్నిమేషానిమేషప్రదీప్తివలన. 92
శా. అర్కేందూవలరత్ననిర్మితమహాహర్మ్యాగ్రభాగంబులం
దార్కొన్ తారకమండలంబు గని ముగ్ధస్త్రీలు రే లప్పురిం
గర్కంధూఫలసన్నిభంబయిన ముక్తాజాలమన్ చింతచేఁ
దర్కింపం దిలకించి నవ్వుదురు గంధర్వాంగనాపల్లవుల్. 93
తే. దక్షమునిరాజు వంతరుద్యానవనము, దక్షవాటంబు శివుని యుత్తమపురంబు
బహుళకైవల్యఫలధర్మపాదపంబు, దీనిఁ గాతురు చుట్టును దిరిగి సురలు. 94
తే. గౌరి యొక్కతె యాకాశగంగ యొకతె
కాశి యొక్కతె దక్షిణకాశి యొకతె
నలుగురును శంభునకు లోకనాయకునకు
రాణివాసంబు లనురాగరసము పేర్మి. 95
వ. ఒక్క సమయమ్మున దక్షారామమున కేతెంచి భీమమండలంబునందు. 96
క. శోభనముహూర్తమున భుజ, గాభరణుఁ బ్రతిష్ఠ చేసి యర్చించి మహా
వైభవ మొనర్చి పొందె మ, నోభిమతము విబుధనాథుఁ డధికస్ఫురణన్. 97
తే. దేవతాభర్త శంభుప్రతిష్ఠ చేసి, సురగణంబుల లోకపాలురను జూచి
యనియె మీరును భీమనాయకుని వీట, సిద్ధశివలింగములఁ బ్రతిష్ఠింపవలయు. 98
ఇంద్రుఁడు దేవతలకు శివలింగమాహాత్మ్యంబుఁ జెప్పుట
సీ. శ్రీకంధరుని బ్రతిష్ఠించు నెవ్వఁడు వాఁడు, పాపియైనను శంభుపదముఁ గాంచు
శివలింగపదయాత్ర శివలింగసంవీక్ష, శివలింగసంస్పృష్టి శివసమర్చ