పుట:నాగార్జున కొండ.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

బుద్ధభగవానుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యమున బోధిసత్వ నాగార్జునుడు నివసించిన శ్రీపర్వతమూ, కళాపిపాసులు సమ్యక్సంబుద్దపాదభక్తులూ అయిన ఇక్ష్వాకు రాజపుత్రికలు తయారు చేయించిన లోకోత్తరశిల్పాలూ, ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని ఆయిన: విజయపురీ గల నాగార్జునకొండలోయ ఆంధ్రులందరికీ పుణ్యస్థలము 1828 నుంచీ యిక్కడ జరుగుతూన్న ఖననపరిశోధనకి ఫలితం ఇక్కడ ఎన్నో అద్భుతములైన అవశేషాలు వెలికి వస్తున్నాయి.

నాగార్జునసాగరకట్ట నిర్మాణం పూర్తి అవడంతో ఈలోపుల యావత్తూ కృష్ణాజలంలో లీనం అయిపోతుంది. ఆ మీద ఈ పుణ్యస్థల "కలలోని వార్త" అయిపోతుంది. ఈలోగానే ఇక్కడికి యాత్ర చేసి ఈ పుణ్యస్థలాన్ని దర్శించి ఆంధ్రులంతా తమ విధిని నిర్వహించాలి ఈ లోయ విగురించిన వివరాలు ప్రభుత్వంవారి ప్రచురణలలో ఉన్నవి. అవి సామాన్యులకి అందుబాటులో లేవు. ఈ పుణ్యక్షేత్రాన్ని చూడబోయేవారి ఉపయోగార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. దీనికి నాగార్జునకొండ ప్రాముఖ్యం సంగ్రహంగా చెప్పబడింది. ఇక్కడ శిల్పాల ఫొటోలు కొన్ని పుస్తకం చివర వేయబడినవి మిగతవి ఎక్కడ లభిస్తాయో సూచించబడింది.

ఈ గ్రంథం విషయమై ఆసక్తి చూపి, దీనిని చక్కగా ముద్రించి ఆజంతా ప్రచురణాధిపతులకు నా కృతజ్ఞత.

ఈ పుస్తకం ఆంధ్రలోకం యొక్క ఆదరాభిమానాలని పొందుతుందని నేను ఆశిస్తున్నాను.

హైదరాబాదు)
11- 12--1956

మారేమండ రామారావు