పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xv

నిద్రాణంగా వుండి, ప్రస్తుతం జాగృతమైన తన ప్రాణశక్తుల సహాయంతో ప్రకృతి రహస్యాలను ఛేదించగల సామర్థ్యం అతనికి వుంటుంది.

అంటే మూఢ విశ్వాసాల మతపు ఆధిపత్యాన్నీ, భౌతిక విజ్ఞాన శాస్త్రాన్నీ ఆయా సిద్ధాంతాల పరిధుల్లోనే ఎదిరించి, తలపడగల శక్తియుక్తులు అతడికి వుంటాయి. ఇది తన మనో సంకల్పాన్ని వుపయోగించడం ద్వారానూ, అతీంద్రియ శక్తుల ద్వారానూ అతడు చేయగలుగుతాడు.

1882 లో బ్లవట్ స్కీ దివ్యజ్ఞాన సమాజం వారి ప్రధాన కార్యాలయాన్ని భారతదేశానికి తరలించింది. ఎందుకంటే దివ్యజ్ఞానంవారి సిద్ధాంత శాసనంలో హిమాలయ పర్వతాల్లో మహాశక్తివంతులైన పరమగురువులు వాసం చేస్తున్నారని వున్నది, మద్రాసు నగరానికి చేరువలోనే వున్న ఒక సువిశాలమైన స్థలాన్ని యిందుకోసం ఎన్నుకున్నారు. ఆ ఆవరణ అంతా పచ్చని కొబ్బరిచెట్లతోనూ, పూజనీయంగా తోపించే బ్రహ్మాండమైన మర్రివృక్షాలతోనూ కలకలలాడుతూ వుంటుంది. ఒక వైపున అడయారు నది ప్రవహిస్తూంటే మరొకవైపు బంగాళాఖాతం సరిహద్దుగా వుంటుంది. ఆ అడయారు తోట లోపల కాలక్రమేణా దివ్యజ్ఞాన సమాజం వారు ప్రత్యేకంగా ఎన్నుకున్న నమూనాల్లో నిర్మించిన దేవాలయాలు, మందిరాలు, చర్చీలు, మసీదులు ఎన్నో వెలిశాయి.

భారత భూ భాగంమీద యీ సమాజం అవతరించడం అనేక భవిష్య ప్రయోజనాలకు ఒక ద్వారాన్ని తెరిచినట్లయింది. అప్పటివరకు వున్నత వర్గాలకు చెందిన భారతీయులకు, ఆంగీకరించబడిన సమాజంలో వారు భాగస్థులవడంవల్ల తమ మతాన్నీ, తమ కళలనూ యితరులు నిరసించడం అలవాటైపోయింది. అసలు వారే తమ సంస్కృతిని పాశ్చాత్య ప్రమాణాలతో కొలిచి చూడటం నేర్చుకున్నారు. అటువంటి వారికి పురాతనమైనవీ, సంకుచితమైనవీ అయిన అంశాలనుంచి తమ ఆధ్యాత్మిక గతానికి యీ సమాజపు సిద్ధాంతాలు విముక్తి గల్పించి, విశ్వాత్మకంగా రూపొందించి, ఆ విధంగా పరిపూర్ణవంతం చేయడం కనువిప్పు కలిగించింది. అటువంటి ఎంతోమందిని యీ సమాజం ఆకర్షించి తన సభ్యులుగా చేర్చుకుంది. తమ ఆధీనంలో వున్న వలస దేశస్థులను తమ మతంలోకి మార్చుకోవాలని వచ్చిన క్రైస్తవ మత ప్రచారకులు, యీ దేశపు విశ్వాసాల ఆకర్షణకు పాశ్చాత్యులే లోనవు తుండటం చూసి దిగ్ర్భాంతి చెందసాగారు. జాతీయ భావాలను పురికొల్పే విషయాలంటే అతి సందేహంతో చూస్తే ప్రభుత్వం కూడా యీ మతప్రచారకుల లాగే కళవళపడింది. సనాతనాచార పరాయణులైన హిందువులు కూడా తమ పాత సంప్రదాయాలకు భ్రష్టత కలుగుతుందేమోననే భయంతో యీ నూతన సమాజాన్ని ఆమోదించలేదు.