పుట:కాశీఖండము.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

281


శిలాఘట్టంబు మెట్టి నిలిచి సంతతస్వాధ్యాయాధ్యయనధ్వనిముఖరంబును, నగ్నిహోత్రధేనుఖరఖురవలయార్ధచంద్రచంద్రకితాజీపంబును, ద్రికాలశంభుపూజాసమారంభవిజృంభమాణశంఖకాహళబహుళకోలాహలాకులంబును నగునయ్యానందకాననంబునందు బ్రహ్మపురివాడకుం జూడారత్నం బైన నాపుట్టిని ల్లభివృద్ధి బొంది యుండుంగావుత! కాశికకటకవిప్రకుటుంబినీశ్లాఘనీయచరిత్రయగు నాజనయిత్రి పియంవద ముత్తైదువ యగుంగాత! అష్టాదశమహావిద్యాస్థానసామ్రాజ్యభద్రాసనాసీనుం డగురుద్రావాసవిద్వత్సింహంబు నాతండ్రి హరిస్వామి సమానులయం దుత్తమశోకుం డగుంగాక! మహాశ్మశానంబునం దనూచారం బగు నాబంధువర్గంబు బంధువర్గంపుఁదీఁగయుంబోలెఁ గొనసాఁగి బ్రతుకుంగాక యని యాశీర్వదించి.

169


సీ.

ఏఁ బ్రభాతంబుల నీశానవాపిక
        ననిశంబుఁ దీర్థ మాడిన ఫలంబు
వివిధభంగుల నేను విశ్వేశ్వరస్వామి
        ముక్తిమంటపి నిడ్డ మ్రుగ్గుఫలము
ప్రతిచతుర్థిని డుంఠిభద్రేభవక్త్రు నే
        నారాధనము సేసినట్టిఫలము
నానందకాననాభ్యంతరక్షేత్రంబు
        నందు జన్మించినయట్టిఫలము


తే.

సర్వమునుకూడి మీఁదటిజన్మవేళ
నితనికే భార్యఁగా నన్ను నిచ్చు గాతఁ