పుట:కాశీఖండము.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

శ్రీకాశీఖండము


యనుచు హరిణాంకమూర్తి తీవ్రాంశుఁ బోలె
గొసర కగ్నిఁ బ్రవేశించెఁ గువలయాక్షి.

170


క.

లింగత్రయగర్భిణి యగు
నంగనసాన్నిధ్యమున నిశాటుండును ద
త్సంగతి విద్యాధరరా
జుం గాంచిరి త్రిదివపదము సుకృతస్ఫురణన్.

171


వ.

అంతఁ గొంతకాలంబునం బ్రియాస్మరణంబు సేసెం గావున విద్యాధరకుమారుండు మలయకేతుం డనునామంబునను నగ్నిప్రవేశసమయంబున నవ్విద్యాధరకుమారుండు తనకుం బతి కావలయు నని కోరెం గావున సుశీల కళావతి యనుపేర భూమండలంబున జన్మించి వధూవరులైరి. ఆదంపతులయందుఁ గళావతీదేవి పూర్వజన్మవాసనావశంబున.

172


మ.

అళినీలాలక దాల్చుఁ జన్నుఁగవ రుద్రాక్షావళీదామకం
బులు ముక్తామణిభూష లొల్ల దస్తాంభోజాతపత్రాక్షి మై
నలఁదున్ భస్మ మలంద నొల్ల దొకనాఁ డైనం బటీరద్రవం
బులు పన్నీరు కురంగనాభియును గర్బూరంబు కాశ్మీరమున్.

173


తే.

కడుపు నిండంగఁ గాంచె నక్కలువకంటి
మలయకేతుమహీపాలమన్మథునకు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభ వాది
శుభగుణశ్రీసమృద్ధుల సుతుల ముగుర.

174


వ.

అంత నొక్కనాఁడు చిత్రకరుండొకరుండు వారణాసీస్థానవృత్తాంతంబు చిత్రపటంబున లిఖియించి తెచ్చి కళావతీసహితుండైన మలయకేతుసన్నిధిం బెట్టిన నవ్విలాసవతి పటంబు చూచి ప్రాగ్జన్మవాసనావశంబునఁ దన్ను మఱచి సమాధి