పుట:కాశీఖండము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

233


తే.

ఒక్కనాఁ డోలగంబున నున్నవేళ
గురునితొడమీఁదఁ గూర్చుండె సురుచికొడుకు
ధ్రువుఁడు నేతెంచి వాఁ డున్నతొడయె యెక్క
సురుచి వారించె భూపతి చూచుచుండె.

283


వ.

అప్పుడు మఱలి వాఁ డంతఃపురంబున కరిగి యావృత్తాంతం బంతయుఁ దల్లి కెఱింగించి పిన్నయయ్యును నుత్తమక్షత్త్రియతేజోవిశేషంబునం బరిభవంబు సహింపఁజాలక తల్లియనుజ్ఞ వడసి తపంబు సేయ జనువాఁడై యదృచ్ఛాగతు లగు సప్తఋషుల గాంచి సముచితప్రకారంబునం దనవృత్తాంతంబు వారి కేఱిఁగించి వారివలన ద్వాదశాక్షరమంత్రం బుపదేశంబు గొని పరమభక్తిపరాయణుం డైన నారాయణు మధువనప్రాంతంబున యమునాతటంబునఁ బెద్దకాలంబు పెక్కువిఘ్నంబులకు మనంబు చలింపనీక యారాధించి సాక్షాత్కరించిన యప్పుండరీకాక్షువలన విశ్వోత్తరం బైన యిప్పదంబుఁ గాంచె.

284


తే.

ధ్రువుని కిచ్చినవరమును ధ్రువము గాఁగ
నతఁడు దాను వారాణసి కరిగె శౌరి
వానిఁ దనవెన్కదిక్కున వైనతేయు
మీఁద నెక్కించుకొని చిట్టమిడుచు నంత.

285


మ.

శివుఁ గాశీపతి విశ్వనాయకుని సంసేవించి యప్పార్వతీ
ధవునాజ్ఞన్ గ్రహచక్రవాళమున కూర్థ్వం బైనలోకంబునన్
ధ్రువ! వర్తింపు మనేకకాల మనుచున్ బోధించి యేగెన్ మనో
జవనుం డైనఖగేంద్రు నెక్కికొని విష్వక్సేనుఁ డెందేనియున్.

286


వ.

ధ్రువుండును.

287