పుట:కాశీఖండము.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

239

శ్రీకాశీఖండము


వించుచున్నవారు. ఇది సప్తమహామునిలోకవృత్తాంతంబు. ఈలోకంబున కూర్ధ్వంబున.

278


ధ్రువపదవర్ణనము

సీ.

త్రైలోక్యమంటపస్తంభసంభారంబు
        గగనలక్ష్మీకంఠకనకభూష
బ్రహ్మాండకేతకీపాదపప్రసనంబు
        గంగాతరంగిణీక్రౌంచఖగము
బలిదైత్యమథనాంఘ్రిపంకేజవఖరంబు
        దారకావళితులాదండయష్టి
ధాతృలోకద్వారదంతకవాటంబు
        గ్రహమండలీపశుగ్రామవేది


తే.

తారకాశింశుమారకాకారుఁ డైన
యాదినారాయణునితోఁకయలఁచివ(పు)ర
తప్ప కీక్షింపు ధరణిబృందారకేంద్ర!
వివిధకల్పపరంపరాధ్రువుని ధ్రువుని.

279


వ.

ఈతనిలోకవృత్తాంతంబు వినుము.

280


క.

స్వాయంభువమనుధాత్రీ
నాయకుఁ డుత్తానపాదుఁ డనఁ గాంచె సుతున్
దోయజనేత్రలు గేహిను
లాయయ్యకు నిరువు రంబుజాసనవంశ్యా!

281


తే.

కాంత యొక్కత సురుచి యొక్కత సునీతి
సురుచి కుత్తముఁ డను పేరిసుతుఁడు పుట్టె
ధ్రువుఁడు పుట్టె సునీతి కాధ్రువునికంటె
నుత్తమాహ్వయు మన్నించుచుండుఁ దండ్రి.

282