72. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీల సంక్షేమం కోసం రూ.2,050.23 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.
73. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం రూ.2,846.47 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం
74. ప్రభుత్వం తన ముందు ఉంచుకొనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణను ఆ కార్యాచరణ విధానాలు నిర్దేశిస్తాయి. సమాజంలోని పౌరులకి ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ఆ సేవలను అందించే ఉపకరణాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కానీ, గ్రామస్థాయిలో అత్యవసర సేవల, పౌర సేవల నిర్వహణలో దశాబ్దాలుగా చెప్పలేని స్తబ్దత, జడత్వం గూడుకట్టుకొనిపోయాయి. ఈ స్తబ్దతను ఛేదించడం కోసం గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న మహాత్ముని దార్శనికతకు స్ఫూర్తిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పారు. ప్రభుత్వ సేవలను సాధారణ పౌరుడి ఇంటి గుమ్మం ముందుకు తీసుకుపోవడం ఈ సంస్థల ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ పాలనను సుపరిపాలన మరియు సుసాధ్యం చేసే దిశగా ఈ సచివాలయాలు రూపుదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష.
యువత సంక్షేమం - నైపుణ్యాభివృద్ధి కల్పన
29