పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైనారిటీల సంక్షేమం

67. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా 15,830 మంది నిరుద్యోగ యువతకు శిక్షణను అందించడం జరిగింది. ఇమామ్ లకు, మౌజన్లకు ప్రభుత్వం వరుసగా రూ. 5,000, రూ.3,000 నెలవారీ గౌరవభృతి చెల్లిస్తున్నది. జెరూసెలం పుణ్యభూమికి చేపట్టే తీర్థయాత్రలకు అందించే సహాయాన్ని కూడా మేము పునరుద్ధరించాం. ఈ తీర్థయాత్రకు అందించే సబ్సిడీ మొత్తాన్ని కూడా రూ. 20,000 నుండి రూ.40,000 కు పెంపుదల చేసాం.


వై.యస్.ఆర్. లా నేస్తం

68. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వై.యస్.ఆర్. లా నేస్తం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతి నెల రూ. 5000/- ల స్టెఫండ్ ఇవ్వటం కోసం రూ.12.75 కోట్లు కేటాయించడం జరిగింది.

ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు మరియు రెసిడెన్షియల్ విద్యాలయాలకు సంబంధించిన పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పై పథకాలు అమలుచేస్తున్నాము.

69. షెడ్యూల్డు కులాల సంక్షేమం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15,735.68 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

70. అన్ని గిరిజనాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా నిర్వహించడానికి గిరిజన ఉపప్రణాళిక కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.5,177.54 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

71. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక నిమిత్తం రూ.25,331.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

28