పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాధించాలి తప్ప, 'ఏకత' కోసం ఆరాటపడకూడదు. సామాజిక, వ్యక్తిగత ఆచారాలు కూడా చాలా సందర్భాల్లో ఆచరణలో వారి మతాచారాలతో కలిసిపోయి ఉంటాయి. పరస్పరం వాటిని గౌరవీంచుకోవాలి. అధ్యాత్మికతకూ, వేదాంతానికీ, మతాలకూ ఉన్న సున్సితమైన భేదాల్లాంటివే ఇవి. వీటిని మన్నించే సమాజాన్ని నిర్మించడం కోసం తగిన విద్యావిభానాలను రూపొందించాలి. విద్యార్థిదశలోనే ఇలాంటి ప్రాతిపదికలను ఏర్పరచాలి.

అన్నిటికంటే ముఖ్యమైన సంగతి-కిందినుండి పై స్థాయి వరకూ విద్యారంగ నిర్వహణ ఎవరిచేతుల్లో ఉండబోతున్నదనేది. దాదాపుగా గడచిన నలఖై ఏళ్ళుగా మెల్లమెల్లగా మన ప్రభుత్వాలు విద్యారంగంలో తమ బాధ్యతలకు నీళ్లాదులుతున్నాయి. కొద్దికొద్దిగా మొదలైన ఈ ధోరణి పెరిగి పెరిగి “ప్రపంచీకరణ విధానాలు” ఊపందుకున్న గత రెండు దశాబ్దాలకు పైగా మొత్తం విద్యావ్యవస్థ పెట్టుబడిదారుల, విద్యావ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాజకీయనాయకులు ఈ వ్యాపారంలోకి చేరడమో ఇందులోని వారే రాజకీయాల్లోకి చేరి ఉన్నత పదవుల్లో పెత్తనం చేయడమో జరిగిపోతూనే వుంది. ఇదొక ప్రత్యేకమైన 'మాఫియా' లక్షణాలను సంతరించుకొంటున్నది. ఈ పరిస్థితులు కొత్త విధానం వల్ల మారుతాయా అంటే అందుకు ఏమాత్రం అవకాశం లేదనే అనిపిస్తున్నది. కొత్త విద్యావిధానాన్ని నిశితంగా పరీక్షిస్తే ఈ అంశం స్పష్టమవుతుంది.

కొత్త విధానం ప్రకారం నిర్వచించిన 5+3+3 వరకైనా - అంటే పానశాల విద్యను పూర్తిగా ప్రభుత్వం చేపట్టి బాధ్యతతో నిర్వహించాలి. అ పై విద్యలో ఆర్థికానికి సంబంధించి ఏం చేస్తారన్నది వేరే అంశం. పరిశ్రమలు తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్లు వెచ్చించి మౌలిక వసతుల పేర సమస్త సౌకర్యాలనూ కలుగజేస్తున్న ప్రభుత్వాలు, మన బిడ్డలను-భావిపౌరులను-సమానంగా అభివృద్ధి చేసేండుకు కావలసిన మౌలిక విద్యను కనీసం పాఠశాల విద్యను అందరికీ ఒక రాజ్యాంగ హక్షుగా ఉచితంగా సమకూర్చవద్దా? ఇందుకు అవసరమైన చట్టాలను, అవసరమైతే రాజ్యాంగసవరణలనూ చేసి ముండుకు సాగాలి. ప్రపంచంలో అనేక దేశాలు విద్యారంగానికై స్థూలజాతీయోత్పత్తిలో 10 శాతం వరకూ కేటాయిస్తుంటే మనం అందుకోసం వెచ్చిస్తున్నది 4 శాతంలోపు! ఇప్పుడు దీనిని 6 శాతం వరకు పెంచాలనే ప్రతిపాదనను జా.వి.వి. సూచిస్తున్నా ఇదెంతవరకు జరుగుతుందో నమ్మకం కుదరడం లేదు.

దేశంలోని సామాజిక అసమానతల దౌర్భాగ్యం నుండి, అర్థిక దోపిడీ నుండి కనీసం పాఠశాల విద్యావ్యవస్థను విముక్తం చేయాలి. ఇందుకు పూనిక వహించని విభానాలు ప్రజల మేలుకొరేవి కావు.

పాఠశాల విద్యలో కనీసం ప్రాథమిక విద్య వరకూ, అమ్మనుడుల్లో జోధన జరగాలని, వీలైతే 8 వరకూ అలా ఉండాలని జా.వి.వి. అంటున్నది. మరి ఈ అంశాన్ని దేశమంతా ఒకేరీతిలో ఆచరణలోకితెచ్చేటట్లు కేంద్రం బాధ్యత వహించగలదా? అవసరమైన చట్టాల సవరణలు లేదా రాజ్యాంగ సవరణలు చేసి దీనిని తప్పనిసరి చేసేండుకు కేంద్రప్రభుత్వం పూనుకొంటుందా? (అమ్మనుడి జనవరి 2020 సంపాదకీయం చూడండి). ఇందుకు తగ్గ నిర్ణయాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించగలదా? పాఠశాల విద్య (కనీసం 5+3+3 వరకు) నుండి అన్నిరకాలైన (ప్రయివేటు విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వమే వాటి నిర్మాణాన్ని నిర్వహణను చేపట్టి అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడానికి సిద్ధపడుతుందా? ఈ రెండు అంశాలు ఆచరణలోకి రాకుండా, జా.వి.వి. ఏమీ చెప్పినా, ప్రభుత్వం ఏంచెయ్యబోతున్నా వాటిని నమ్మడానికి వీల్లేదు.

ఈ విద్యావిధానం వల్ల ప్రాథమిక విద్య వరకూ తెలుగుకు పట్టం కట్టబోతున్నారని కొందరు భ్రమపడుతున్నారు. వారు దయచేసి శ్రద్ధగా జా.వి.వి.ని మళ్లీ పరిశీలించాలి. ఎక్కడా, తప్పనిసరి అనిగాని, అందుకవసరమైన చర్యలు చేపడతాం అనిగాని చెప్పలేదు. విధ్యార్థులకు స్వేచ్చనిస్తున్నామని, రామ్ష్రాలకు స్వేచ్చ ఉందనీ నీతులు పలుకుతున్నారు. ఈ సందుల్లోంచి మన రాష్ట్రప్రభుత్వాల్లోని స్వార్ధశక్తులు ఎన్ని అవకాశాలను వెతికి తీస్తాయో చూడండి.

ఇక ఇంగ్రీష్‌ సంగతి- ఎక్కడా దాని ఆధిపత్యాన్ని కట్టడి చేసే చర్యలను జా.వి.వి.లో ప్రస్తావించలేదు. పైగా-త్రిభాషాసూత్రంలో రెండు దేశీయ భాషలుండే సంగతి ఎట్లావున్నాా మరో భాషగా- ఇంగ్షీషు స్థానం దేశమంతా భద్రంగా ఉంటుంది. చట్టాలను అమోదించడం నుండి పరిపాలనలో అన్ని దశల్లోను, కోర్టుల్లోనూ దాని న్థానం మరింత పదిలం అవుతూనే ఉంటుంది. దానితో పాటు హింది, సంస్కృతాలకూ మంచి భవిష్యత్తే. ఎటుతిరిగీ తక్మిన జాతీయ ప్రజల భాషలకు కలిగే ముప్పుకు జా.వి.వి అడ్డుకట్ట వెయ్యడం లేదు! రాజకీయ, ఆర్థిక, సామాజిక దోపిడీకి, ఆధిపత్యానికి మనం లొంగిపోవలసిందేనా?

తేదీ : ౩1-8-2020 సామల రమేష్ బాబు| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి. ఈ సెప్టెంబర్‌-2020 క్‌