పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాళ్లకోసం పరితవిస్తున్నాయి. ఒకటి క్రి.శ. 1074 నాటి తూర్పుచాళుక్య విష్ణువర్ధన మహారాజుల శాసనం, రెండోది క్రీ.శ 1125 నాటి మహామండలేశ్వర కీర్తిరాజు మల్లిదేవచోడమహారాజు శాసనం, మూడొది క్రీ.శ 1264 నాటి మహామండలేశ్వర అల్లాడ పెమ్మయ దేవమహారాజుల శాసనం. ఆ శాసనాలను చూస్తున్నంత సేవు తాతముత్తాతలను చూస్తున్నంత ముచ్చట పడిపోయాను. విప్పర్తిని, విత్సత్తి, _ విత్పత్తి, పెదవిప్పత్తి అని పిలిచేవారని, ఆలయంలోని శివుణ్ణి మహామల్లేశ్వరుడ నేవారని, శ్రీనివాస్‌కు వివరించాను. శాసనాల్లో పాఱ అన్న శబ్దం బ్రాహ్మణులను సూచిస్తుందని, కడపజిల్లా కొర్రపాడు, రామాపురం (క్రీ.శ. 8వ శతాబ్టి) క్రీ.శ. 10వ శతాబ్దినాటి అరకటవేముల శాసనాల్లో కూడా కనిపిస్తుందని చెప్పాను. అంతేకాదు ఈనాడు మనం రాయబారిగా పిలుచుకొంటున్న పదానికి రాయపాఱ అన్న పదం మూలమని, అనగా, ఒకరాజు మరో రాజుకు తన ప్రతినిధిగా పంపే పాఱ (బ్రాహ్మణుడు) ను రాయపాఱ అని పిలిచేవారని చెప్పాను.

విప్పర్లలోని క్రీ.శ1195 నాటి శాసనంలోని మల్లిదేవచోళమహారాజు ప్రస్తుత ప్రకాశంజిల్లా కొణిదెన నుంచి పాలించాడు. అతడు ఇక్కడి మల్లేశ్వరస్వామి దేవాలయంలో పుణ్యక్షేతాల సందర్శకులకోసం ఒక చలివేంద్రాన్ని రోజూ వెయ్యమందికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆకాలంలో విప్పర్ల ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ఎంతగా వెలుగొందిందో తెలుస్తుంది. ఇక తూర్పుచాళుక్యుల కాలపు ఈ శివాలయం లింగంపైన “శివశివ " అన్న క్రీ.శ.8 వ శతాబ్ధి తెలుగు-కన్నడ అక్షరాలున్నాయి.. చండి, వినాయక, మహిషాసురమర్దిని, భైరవ శిల్పాలు వేంగీచాళుక్య శిల్చకళకు అద్దంపడుకున్నాయి. పల్లవ బాదామీ చాళుక్య (రెండోపులకేశికొప్పరం) శాసనాల్లో కూడా విప్పర్ల ను విఱిపఱగా పేర్మాన్న సంగతి విని- శ్రీనివాస్‌ మురిసిపోయాడు. నేలమీద పడుకోబెట్టిన, గోడకు ఏటవాలుగా అనించిపెట్టిన వెయ్యేళ్లకుపైగా చరిత్రగల శాసనాలు, శిల్పాలను పీఠాలపై నిలబెట్టి, వాటి వివరాలు రాసిన పేరు పలకల్ని ఏర్పాటుచేయమని శ్రీనివాస్‌కు చెప్పాను. తరువాత శాసనాల్లో పేర్మొన్న మ్లావిండ్ల చెరువును ఒకసారి కలియజూచి, కట్టమీద చండికను పైకిలేపమని చెప్పి, విప్పర్ల, రెడ్డిపాలెం మీదుగా చేజర్లకు బయలుదేరాం.

చేజర్లకు వెళుతూ కుంకలగుంట చేరిన మమ్మల్ని బాపతు సత్యనారాయణ రెడ్డిగారు వాళ్లింటికి ఆహ్వానించి, అతిథి మర్యాదల నందించారు. ఆయనే స్వయంగా, కుంకలగుంటలో పునర్నిర్మించబడిన వీరభద్రాలయం, ఖోగేశ్వర, కేదారేశ్వర, చెన్నకేశవాలయాల్ని చూపించారు. భొగేశ్వరాలయంలోని క్రీ.శ. 1347నాటి కొండవీటి ప్రోలయ వేమారెడ్డి శాసనంలో, క్రుంకలకుంటలోని వల్లభేశ్వరుని ఉపహారాలకు, గుడ్డపల్లి, ముప్పాళ్ల చెరువులక్రింద ఇచ్చిన భూముల వివరాలు, పూజారుల పేర్లను ఒకసారి జ్ఞాపకం చేసుకొన్నాను. స్థానిక వేణుగోపాలస్వామి దేవాలయంలోని క్రీ.శ. 1275 నాటి కాకతీయ రుద్రమదేవి అంగరక్షకుడు చేసిన భూదాన శాసనం, వీరభద్రాలయంలోని క్రీ.శ. 1321 నాటి కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా మోట్టపల్లి భాస్మరదేవుని మంత్రి మల్లయగారు కుంకలకుంట్ట మూలస్థాన కేదారదేవునికి భూమి, గానుగ, వీసం ధనం, పెట్టిన వివరాలున్న శాసనాలను పరిశీలించాను. చేజర్లకు బయలుదేరుతుంటే భోజనం పెట్టిన బాపతు సత్యనారాయణరెడ్డి గారు నన్నొక ప్రశ్నవేశారు. మావూరు పేరు కుంకలగుంటకు అర్ధం చెబుతారా అని. క్రుంకలగుంట/కుంకలగుంట అంటే క్రుంక =మునుగు అని, కుంక =బాలవితంతువని శబ్ధరత్నాకరంలో ఉందనీ, బహుశా, చేజర్ల పుణ్యక్షేత్రాన్ని సందర్శించటానికి వెళ్లేవాళ్లు ఇక్కడున్న గుంటలో మునిగి పవిత్రస్నానమాచరించే వారేమోననీ ఒక వివరణ ఇచ్చాను. మరో అర్ధం ప్రకారం, బాలవితంతువు లెక్కువగా ఉన్న వూరుగానీ, లేక బాలవితంతువుల పునరావాస కేంద్రంగానీ, ఆరోజుల్లో ఉండి ఉండవచ్చన్న రెండో వివరణ కూడా ఇచ్చాను. ఆయన ఎందుకో మొదటి వివరణవైపే మొగ్గుచూపాడు. ఇక నేను శ్రీనివాస్‌తో కలిసి చేజర్లకు పయనమైనాను.

గుంటూరుజిల్లాలో మంచికల్లు, గురజాల, గోలి, కంభంపాడు, కోటనెమలిపురం లాంటి బౌద్దక్షేత్రాల నడుమ శాతవాహన కాలంలో విలసిల్లిన బౌద్దారామాల సరసన చేరిన చేజర్ల ఇక్ష్వాకుల కాలంలో ఎందరో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

35