పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఈమని శివనాగిరెడ్డి 98485 98446

అడుగుజాడలూ ఆనవాళ్లు-6

విప్పర్ల - చేజర్ల యాత్ర

ఎప్పట్నించో అనుకుంటున్నట్లుగా విప్పర్ల వెళ్లాలని ఒకపక్క కాదు చేజర్ల వెళదామని మరోపక్క - ఇవేవీ కాదు, మాచర్ల వెళదామని మూడోపక్క- ఇలానా మనసు నిలకడ తప్పింది. రేనాటి చోళవంశీయుడైన ఎరికల్‌ముతురాజు ధనుంజయుడు కలమళ్లలో క్రీ.శ. 575వ సం॥లో తొలిసారిగా ఒక తెలుగు శాసనాన్ని వేయించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు 75ఏళ్ల తరువాత, వేంగీచాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జవిష్ణువర్ధనుని కుమారుడు, మొదటి జయసింహుడు క్రీ.శ 649వ సం॥లో విప్పర్లలో ఒక తెలుగు శాసనాన్ని వేయించి, శాసన పరిశోధకులు, చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాడు. సంస్కృతభాషా తుపాను తాకిడికి విలవిలలాడుతున్న తెలుగు భాషకు ఊపిరులూదిన జయసింహుని శాసనాన్ని తడిమి మొక్కాలనిపించింది. అది బలమైన కోరికగామారి, తీరికలేకపోయినా, మాచర్ల చేజర్లలను పక్కనబెట్టి, విప్పర్లవెళ్లటమే మేలనిపించింది. ఒకవారంపాటు ఆగింతర్వాతగాని ఈ ప్రయాణం కుదిరి, నా మనసు కుదుటపడింది. పల్నాటివైపు అడుగుపడింది.

ఎలాగైనా ప్రియుణ్జి కలుసుకోవాల్సిందేనని నిశ్చయించుకొన్న ఓ ప్రేయసి, గండుమీనులున్న గంగానదిని దాటటానికి, ఆహారపు ముద్దల్ని సవ్యసాచిలా విసురుతుంటే చేపలు ఉబలాటంతో అటూఇటూ మళ్లగా చాకచక్యంగా నదిని దాటిన ఆ విరహోత్మంఠలా, నేను నాపనుల్ని పక్కనబెట్టి, పయనంకట్టి, పల్నాటిబాట పట్టాను. మామూలుగానే తెల్లవారురూమున బయలుదేరిన నేను నర్సరావుపేట, నకరికల్లుమీదుగా విప్పర్ల అడ్డరోడ్డు చేరుకొనే సరికి సరిగ్గా ఉదయం ఆరైంది. అప్పుడప్పుడే తెల్లవారుతుంది.


అడ్డరోడ్డు మీద అలికిడి పుంజుకుంది. కారులో నన్ను తీసుకొచ్చిన, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్‌, ఇక్కడ టీతాగి పోదామన్నాడు. అప్పటిదాకా కార్లో కాళ్లుమడుచుకొని కూర్చున్న నాకాళ్లు సంకెళ్లు తెంచుకాన్నంత ఆనందంతో ఉప్పొంగి పోయాయి. టీ తాగి బయలుదేరామోలేదో, విప్పర్ల చేరుకొన్నాం. కొత్తగా నిర్మించుకొన్న ఆనందంలో మునిగిపోతున్న శ్రీనివాస్‌గారితో కొత్తదనం పేరిట చరిత్రను చెరిపేస్తున్నామని వాఫోయాను. తెలుగుభాషాచరిత్ర గ్రంథాలన్నిటిలో చోటుదక్కించుకొన్న విప్పర్తి ముఖచిత్రం మసకబారిందన్న నా బాధనువెళ్లగక్మాను. మావూరికి అంతచరిత్ర ఉందా అనిఅడిగాడు శ్రీనివాస్‌ అమాయకంగా. నాతోపాటు ఆయన్ను చెరువుకట్టపైకి తీసుకెళ్లి తూర్పు చాళుక్య మొదటి జయసింహుని శాసనాన్ని చూపించాలనుకొన్న శాసనం దొరకలేదు. కొద్దిదూరంలో వక్షస్థలం వరకూ కూరుకుపోయిన క్రీ.శ.9వ శతాబ్ధి శిల్పాన్ని చూపించాను.

చెరువు కట్డ దిగి కొత్తగా కట్టుకాన్న గుళ్లదగ్గరకెళ్ళి, పడమరవైపు కాంపౌండుగోడకు ఆనించి వాలుగా నిలబెట్టిన జయసింహుని శాసనాన్ని చూచి ఊపిరిపీల్చుకున్నాను. ఆశాసన పలకను పట్టుకొని అక్షరాల్ని ఆలింగనం చేసుకొన్నాను. ఈ శాసనంలోని తెలుగు పదాల్ని నా పెదవులపై పలికించుకొన్నాను. తెలుగుభాషకు పట్టంగట్టిన జయసింహునికి చేతులెత్తిమొక్కాను. ఎక్కడో, కర్ణాటక రాష్ట్రంనుంచివచ్చిన అతని తండ్రి కుబ్జవర్జనుడు ఇక్కడే స్థిరపడి, స్థానిక ప్రజల మన్ననలు పొందగా, ఆయన కుమారుడైన జయసింహుడు మరో అడుగుముందుకేసి, తన అమ్మనుడి కన్నడభాషను, సామాన్య ప్రజలకు తెలియకపోయినా, దేశమంతటా రాజ్యమేలుతున్న సంస్కృత భాషను పక్కనబెట్టి, తెలుగుభాషకు పట్టంగట్టిన తీరును వివరిస్తుంటే- శ్రీనివాస్‌ విస్తుబోయాడు. ఈ శాసనంలో సంవత్సరంబుళ్‌, ఎడుంబొది(ఎనిమిది), పుణ్జమనాణ్డు (పున్నమినాడు) పులోంబున(పొలాన) ఆడ్డపట్టుసేను (వడ్డు పండే భూమి) తాళుతోంటి (తాటితోపు) పాఱపడువారము (పండుగకు బ్రాహ్మణులకిచ్చే కానుక) యిఱకారు (రెండు కార్ల పంట) విత్పర్తి గాణంబు (విష్పర్తిపొాలం) కవుల ఆయం......... (పొలాన్ని కవులుకివ్వగా వచ్చే ఆదాయంతో)పాఱ (బ్రాహ్మణుడు) అన్న అచ్చతెలుగు పదాల్ని వినిపిస్తుంటే శ్రీనివాస్‌ కళ్లల్లో కాంతులు వెల్లివిరిచి వళ్లంతా పులకింతకు గురికావటం చూచి ఆనందించాను.


యుద్దభూమిలో రెక్కలుతెగిపడిపోయిన యోధుల్లా, అక్కడే ఉన్న మరోమూడు శాసనాలు పట్టించుకొనే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

34