పుట:VrukshaSastramu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీని పంట ఎక్కువగా హిందూస్థానమునందు గలదు. అచ్చట వరి కోసి కుప్పలు వేసిన తరువాత గసగసాలను జల్లుటకై దున్నుట ఆరంబించుదురు. పది దినములకొక మారు చొప్పున నెలపదునైదు దినముల వరకు దున్నుచుందురు. వరికి బనికి వచ్చు నేలలే దీనికి పనికి వచ్చును. ఇట్లు ఎరువు వేయుచు దున్నిన పిదప ఎనిమిదడుగుల పొడగుగను నాలడుగులు వెడల్పుగను మళ్ళు చేయుదురు. గసగసాలని ఒక రాత్రి నీళ్ళలో నాన బెట్టి ఈ మళ్ళలో జల్లుదురు. అవి వారము దినములకు మెలకెత్తును. 5..... 6 అంగుళములెదిగిన తరువాత నీరసముగా నున్నవని తోచిన వానిని పెరికి వేయుట మంచిది. మరి కొంచమెదిగిన తరువాత మొక్కలు మిక్కిలి దగ్గర దగ్గరగా నున్నవని తోచిన యెడల దీసి దూరముగా పాతెదరు. తరువాత, కాయలు కాచు వరకు అప్పుడప్పుడు నీరు పెట్టుచుండ వలెను. ఈ మొక్కలు మూడు నెలలలోనె ఎదిగి పుపుష్పించును. పుపుష్పించిన మూదవ నాడు పువ్వుల రేకులను గోసి వేయుదురు. తరువాత పది దినములకు కాయలు పెద్దవగును.

ఈ కాయల నుండియే నల్ల మందు జేయుదురు. కాయలు గోసిన నాడో మరునాడో మధ్యాహ్నము వేళ కాయల