పుట:VrukshaSastramu.djvu/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

263

కాపీ మొక్కలు కొంచె మెత్తు ఎదిగిన తరువాత వానిని గత్తరించుదురు. మొక్కలు మూడేండ్లు ఎదిగిన తరువాత ఐదు అడుగులెత్తు యుంచి పైన నరికి వేయుదురు. చివర నొక కొమ్మ బయలు దేరును. కాని దీని క్రింద నున్న కొమ్మలకే సూర్య రస్మియు గాలియు బాగుగ నుండుట చే అవియే బాగుగ ఫలించును. కాయల భారమునకు రెండు కొమ్మలను రెండు వైపుల వంగి యుండును.

అందుమూలమున చెట్టు కొంచెము మధ్యగా చీలి అందు పురుగులు ప్రవేసించును గాన అట్లు కత్తరించుట వలన కొమ్మలు వంగి కోయుటకు వీలుగ నున్నను అది మంచి పద్దతి కారు. కొమ్మలను నిలువుగా నెదుగ నిచ్చుటయే మంచి పద్దతి. కొన్ని చోట్ల రెండేండ్లప్పుడే మొక్కలను కత్తరించుచున్నారు. చాల చోట్ల పంట పండగనే కాయలు కాచిన వానిని గత్తరించి వైచి యిక ముందు కాయలు గాయ వలసిన వానిని కాపాడుదురు. ఎండి పోయిన కొమ్మలను కుళ్ళు చున్న వానినెప్పుడైనను లాగి వేయ వలసినదే. ఒక్కక్కప్పుడు బెరడు నంటుకొని యుండు ప్రాకుడు, నాచు వంటి వానిని గీసి వేయ వలయును.

ఈ మొక్కలకుండవలసిన నీడనుగూర్చికూడ నభిప్రాయ భేదము గలుగు చున్నది. కాని కొన్నిచోట్ల కంది మొక్కల