ΦΥΩ_9) స్వీయ చ రి త్ర ము Kదిలోనికిఁ బోయి కూపచుండి భటుఁ డడ్గి నప్పుడు పెట్టె తాళము చెవి యూతని చేతి కిచ్చి చంపి తానక్కడనుండియే యింటికిఁబోయిరి. తన స్థాన భ్రంశమునకు నేను కారకుఁడ నని భావించి పంతులవారు రాజమహేంద్ర వరము చేరిన తరువాత మి" యనుగ్రహమువలన నాకు గోదావరీస్నాన పుణ్య ఫలము లభించినదని నా కుత్తరము వ్రాసిరి. రాజధానీ శాస్రపాఠశాలలో నేను పరీక్షా గ్రంథములను బోధించుట యేకాక యన్నితరగతులకును భాషాంతరీ కరణముకూడ నేర్పవలసిన వాఁడ నగుటచేత నాకు పని యధిక మయ్యెను. మాయిల పాఠశాలకు మూడు మైళ్ల దూరములో నుండుటచేత గుఱ్ఱపుబండిని పెట్టుకోవలసిన వాఁడనైనందున నాకు మాసవ్యయము సహితమధిక మయ్యెను. నేను మొట్టమొదట నొక చిన్నగుజ్ఞపుబండిని పెట్టుకొంటిని గాని తరువాత దాని నమివేసి పెద్ద గుఱ్ఱమును పెద్ద బండిని కొని యుంచితిని. ఈ పెద్ద గుజ్ఞ మును తాము బొబ్బిలికి పోవునప్పుడు విక్రయించి వేయుట కయి శేషగిరిరావు గారు నా యొద్ద విడిచిపోయిరి. దానికి నుళ్లు మంచివికాక పోవుటచే უ-vჭ) నెవ్వరును కొన కపcడిరి. ఆది సెలలకొలఁదిని నా యొద్దనుండవలసి వచ్చెను. డానికి గుఱ్ఱపు వాఁడి`కcడును గడ్డి తెచ్చువాఁడొకఁడును ఉలవలు మొదలయినవియు కావలసినందున నెలకిరునది యైదు రూపాయలు కర్చగు చుండెను. తమ ప్రథమ భార్యమరణమున కీగ్యుమే కారణమని మననులోఁ దలఁచియుండి నందున శేషగిరిరావు పంతులు గారు దానిని తమవెంటఁ దీసి కొని పోవ నొల్లరైరి. నేనెన్నిసారులు దానిని ఏలమునకుఁ బంపుచువచ్చి నను ను ళ్లు చూచి యేఁబదియఱువది రూపాయల కంటె సెక్కువ పాటపాడ కుండిరి, నేనొకసారి శనివారము నాఁడు స్వయముగా పోయి యేలములో నూలురూపాయలకు పాడఁగా పయిపాట రానందున నాపాటవిూఁదనే కొట్టుపడి పోయెను. దాని కావఱకైన కర్చులకును క్రయధనమునకును 738 పోయెను. నేనొక దానికి మాఱుగా రెండు గుఱ్ఱములను భరింపవలసినవాఁడ నయినందున మొదటి చిన్నగుజ్ఞమును బండిని తక్కువ వెలకమివేసి యీ పెద్ద స్యమునకు తగిన పెద్దబండిని కొంటిని. నుళ్ల మంచివి కాక పోవుటచేత