ఈ పుట అచ్చుదిద్దబడ్డది
xviii
డైరక్టరుగారు దీని ముద్రణ యత్నము సాగించిరి. ఇట్లు శ్రీస్వామి వారి స్తుతిగ్రంథము శ్రీస్వామివారి యాస్థానకవిరచించినది, యీనాఁటి కిట్లు శ్రీస్వామివారి యాస్థానిలోనే ప్రకటితమగుట సంఘటిల్లినది. ఆనాఁటి తాళ్లపాక వంశమువారు మహనీయులు. వారి రచనము లింకనెన్నో ప్రకటితములు గావలసియున్నవి. వారు శ్రీస్వామివారి కెన్నో కైంకర్యముల జరపిరి. తనభక్తులగు నట్టి యా మహనీయుల సత్కృతులను శ్రీస్వామివారు సంరక్షించుకొందురనియే యాశించుచున్నాఁడను.
శ్రీవేంకటేశ్వర ప్రాచవిద్యా
పరిశోధనాలయము,
తిరుపతి
తారణ ఫాల్గునము.
వేటూరి - ప్రభాకరశాస్త్రి.