పుట:Sinhagiri-Vachanamulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

3) దేవా !

వచనాలు - వ్యక్తిత్వం

వర్ణ వ్యవస్థని ఉన్న పాళంగా పటాపంచలుచేసి కూలదోయ్యమని ఆయన కంఠోక్తి గా చెప్పకపోయినా విష్ణుభక్తి -వర్ణ వ్యవస్థల మధ్య సంఘ ర్షణవస్తే విష్ణుభక్తి వైపే ఆయన మొగ్గుతారు. ఈ క్రింది పంక్తులు 'గమ నించండి.

1) “జాతివర్ణములతో బనిలేదు మీ భక్తుడైనఁజాలుననీ శ్వపచోపి మహీపాల' ఆంటిరి.(26వ వచనం)

2) దేవా !

విష్నుభక్తి లేని విద్వాంసుకంటే
హరికీర్తనము సేయు నతడెకులజుండు
శ్వపచుండైననేమి ఏ వర్ణంబైననేమి ?
ద్విజునికంటెనతండు కులజుండు
దృష్టింజూడగా విద్వజ్జన దివ్యభూషణము
సింహగిరిందలంచిన యాతండెకులజుండు" (౹౹)

3) దేవా !

 మీ చరణయుగళ సేవ కేకులజుండైననేమి ?" (28)

4) దేవా !

మీ దివ్యనామ సంకీర్తన యెవ్వండాయెనేమి
చేయగా వినియిది హీనముఇది హెచ్చు
వర్ణంబులుగానని నిషేధించినవాడు ........

దేవా!

 మీ దివ్యనామసంకీర్తన మెవ్వరునుతియించిరి.
వారెపో పరమ భాగవతులు." (44)

5)

“ఏవర్ణ మైన నేమి మీ దివ్యనామ గుణసంగతి
గలుగజేసి మీదాసానుదాసునిగా జేయవే" (47)

6)

"మీ కులగోత్రంబెన్న నేమిటికి ?" (3)
మనిషినిగా మనిషి పరిగణించటానికి, గౌరవించటానికి అతడు
భగవద్దాసుడు, భాగవతదాసుడు కావటమే ప్రధాన హేతువు
కాని శాస్త్రవై దుష్యం, అభిజాత్యం ఎంతమాత్రం కావం
టారాయన.