పుట:Sinhagiri-Vachanamulu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

ణలు ఉంటాయి. వృత్తగంధి వాక్యాలు గద్యత్రయంలొ కొకొల్లలు ఈ వృత్త గంధులు విశేషంగా ఉండటమేకాదు రాగభావస్ఫోరకంగా, తాళానుగుణంగా, గాన ప్రయోజకంగా ఇవి అవతరించటంవల్ల వీటి జీవలక్షణమే వృత్త గంధిత. స్వయం వ్యక్తిత్వం కలవారవటంవల్ల కృష్ణమాచార్యులు కేవలం అంధానుసరణం చేయకుండా ఎక్కడ చూసినా తమముద్ర ప్రస్ఫుటంగా కనపడేటట్లు విలక్షణమైన శైలిలో వచనాలు వెలయించేరు.

సింహగిరివచనాలు - ప్రతులు

ప్రస్తుతం ముద్రితం అయిన ప్రతి తంజూపూరి సరస్వతీ మహల్ పుస్తకభాండాగారంలో విష్ణు నామసంకీర్తసఫలం అన్న పేరుతో ఉన్న D. No, 803 తాళపత్రప్రతి. ఇందులో 60 వచనాలు ఉన్నాయి. ఇది కాక 'మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో 'సింహగిరి నరహరి వచనాలు' అన్న పేరుతో ఒకతాళపత్రప్రతి ఉన్నట్లు కాట్యలాగువల్ల తెలు స్తోందని, కానీ దాన్ని గురించి మదరాసులో విచారించగా దాన్ని తిరుపతికి తరలించేరన్నారనీ, తీరా తిరుపతిలో విచారిస్తే అది అక్కడకు చేరనేలేదన్నారనీ డా౹౹ కుల శేఖరరావు గారు అంటున్నారు ఈ నిర్లక్ష్యం తిరుపతి వారిదో మదరాసు వారిదో తెలియదు. ప్రథమాంధ్ర వచనకావ్య ప్రతిపోగోట్టు కోవటం సాహిత్య పరంగా ఎంతటి మహానష్టమో ఇప్పటికీ మనవారు గుర్తించినట్టు కనపడదు. మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంవారి క్యాటలాగులనుబట్టి కృష్ణమాచార్య వచనాలుండదగిన లిఖిత గ్రంధాలు 5 కనపడుతున్నాయి. ఇందులో ఒకటి ఇందులోనే మరోగాని ప్రత్యంతరం అంచేత నాలుగు విభిన్న ప్రతులు కృష్ణమాచార్యులకు సంబధించినవి ఉన్నాయన్న మాట, వాటివివరాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

మద్రాసు పాచ్యలిఖిత పుస్తక భాండాగారం ప్రతులు

1 సింహగిరి నరహరి వచనములు. తాళపత్రప్రతి. నెం, 1484 14-3/4" X 1-1/4" :పరిమాణములో 11 పేజీలు. (బహుళ: 11 ఆకులు