పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21వ అధ్యాయము.

కామినీకాంచనములు.

(శ్రీరామకృష్ణపరమహంసులవారి బోధల భావమును చక్కగ గ్రహించువారికి శ్రీవారు స్త్రీయెడ నిరసనభావము కలవారు కారనియు, ప్రతివనితయందును శ్రీవారు సాక్షాత్తు భగవతి స్వరూపమునే గుర్తించువారనియు సులభముగ తెలియవచ్చును. శ్రీవారి యాక్షేపణయంతయు కామనిరసనమును సూచించునదే అయియున్నది. పురుషునిగూర్చి వచించునప్పుడు వానిని కామాగ్నిపాలు చేయుటలో స్త్రీ కారకురాలగునని మాత్రమే శ్రీవారి వాక్యములందు మనము గ్రహించవలసియున్నది. అటులనె శ్రీవారు స్త్రీరత్నములతో మాటలాడునప్పుడు పురుషునివలని అపాయములను గూర్చి నిర్దాక్షిణ్యముగ వచించెడివారు. శ్రీవారి స్వవిషయములోనో వారు స్త్రీపురుష భేదభావమునకు అతీతులై యుండెడివారు.)

399. భక్తిసాధనలను సాగించి భగవంతుని ప్రాపించగోరువారు ముఖ్యముగా కామలోభములయొక్క (అనగా విషయలోలతయొక్కయు; ధనకాంక్షయొక్కయు) వలలందు చిక్కు బడకుండ జాగరూకలై మెలగవలయును. లేనియెడల వారు పరిపూర్ణము నెన్నడు చేరజాలరు.

400. పాడుపడి పాములకు నిలయమైన యింటిలో కాపురముచేయువారు, ఏఅపాయము ఎప్పుడు మూడునోయని