ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20వ అధ్యాయము.
పారమార్ధిక సాధనయందలి
అవాంతరములు.
391. పిఱికితనము, ద్వేషము, భయము, --జ్యముచేయుపట్ల భగవంతుడు గోచరించడు
392. ప్రశ్న:- మనస్సు ఎట్టిదశయందున్నప్పుడు భగవత్సాక్షాత్కారము లభించును?
జవాబు:- మనస్సు ప్రశాంతముగ నున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరించును. మనోజలధిని వాంఛల నెడు గాడ్పులు కల్లోలపఱచుచో అందు దేవునిప్రతిబింబము గోచరించదు; భగవత్సాక్షాత్కారము అట్టిదశయందు అసంభవము.
393. పాపవిషయములందుచరించు మనస్సును మాలపల్లె యందు వసించు బ్రాహ్మణునికి పోల్చనగును; లేదా పెద్దనగరములలోని వేశ్యవాటియందు కాపురముండు సజ్జనునితో పోల్చదగును.
394. అనేకమంది మానవులు వినయము చూపనెంచి "నేను మురికిగుంటలలో నుండు వానపామువంటివాడనండి! అనుచుందురు, అటుల సదామననము చేయుచు నుండువారు కొంతకాలమునకు కీటకములమాదిరి పారమార్ధికత యందు క్షుద్రులగుదురు. హృదయమున నిరాశయుండ