పుట:Shodashakumaara-charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

17


యొక్కపాత్రంబులోపల నునిచి ప్రాఁత
యవలఁ బాకంబుగావించి యదియు నొక్క
కంచమునఁ బెట్టి యొకచీర గప్పి దొంతి
నునిచి యది నీరుదేరంగఁ జనియెనంత.

21


వ.

అది కపటకృత్యంబుగా నెఱింగి.

22


గీ.

పాత్రముల సక్తువులు వీడుపడఁగఁ బెట్టి
యంబరం బది కప్పినయట్ల కప్పి
యేను శయనతలంబున మేను సేర్చి
కన్నుమూసినపోలిక నున్నయంత.

23


వ.

ఆజంత యరుగుదెంచి నేఁ జేసినవిధం బెఱుంగక యత్యంతరయంబున.

24


క.

నా పేర నిర్ణయించిన
యాపాత్రము నాకుఁ బెట్టి యవ్వలిపాత్రన్
వేపుచ్చుకొని భుజించుచు
నాపాపపుజంత మేఁక యయ్యె నరుదుగన్.

25


వ.

దానం గనుంగొని నివ్వెఱఁ గందుచు నాకుం బన్నినయురుల నీవ తగిలితే యనుచు నవ్వుచు భుక్తోత్తరంబున నొక్క రజ్జువున దానికంఠంబు బంధించి తిగిచికొనుచు నొక్కసూనరిగృహంబునకుం జని బట్టి యిచ్చెద ననిన నతనిభార్య యెఱింగి నా చెలియలి నిట్లు చేసితే కాని మ్మని జంకించిన వెఱచి యయ్యజంబు విడిచిపెట్టి దేవాలయంబునకుం జని నిద్రించితి నదియు నదియ వైరంబుగాఁ బాటించి నాచొప్పునం జనుదెంచి యేను మయూరం బగునట్లుగా నీత్రాడు మత్కంధరాంతరంబున బంధింపంబోలు నేనును బర్హిభావంబు