పుట:Shodashakumaara-charitramu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

పోడశకుమారచరిత్రము


ప్రభావిభాసితం బగు తన్నివాసంబు గలయం గనుంగొనునప్పుడు దైవయోగంబున.

17


చ.

ఒకపురినెమ్మిఁ గాంచి ప్రియ మొందఁగ బంధము లూడ్చి పట్టి యం
గకములు దువ్వి దానిమెడఁ గట్టినరజ్జువు గాంచి వీడ్చినన్
శకునిసనూకృతిం దొరఁగి చయ్యన భీమభటాభిధానుఁ డై
ప్రకటవినీతి మ్రొక్కుటయు రాసుతుఁ డద్భుతమోదమగ్నుఁడై.

18


వ.

అత్యంతసంభ్రమంబునం బరిరంభణం బొనరించి యతనిపునఃపునఃప్రణామంబు లాదరించి సమీపంబున నునిచికొని కరంబు కరంబునం గీలించి నీ రూపంబునకుం గారణం బేమి యని యడిగినఁ గరంబు వినయంబున న(తం డ)తని కిట్లనియె.

19


క.

ఆపన్నగంబు కతమున
నాపన్నత మిమ్ముఁ బాసి యలజడి నశనా
యాపీడనొంది యుజ్జయి.
నీపురముం జేరి మేను నెఱిచెడి తూలన్.

20


సీ.

ఏ నొకముదుసలియింటికి నరిగి నా
        కాహార మొనరింపు మనుడుఁ బ్రీతి
వెలయించి భోజనవేళయందాఁకను
        నది నన్ను శయనింపు మనిన శయ్య
నుండి చూచుచు నుండ నొకకొన్నియవ లది
        ధరణిమీఁదటఁ జల్లెఁ దత్క్షణంబ
మొలచి గుబ్బన నేచి ఫలియింప సక్తువు
        గావించి యదియుఁ బాకంబు చేసి