పుట:Shodashakumaara-charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

పోడశకుమారచరిత్రము


నొంది బోయలచేతం బట్టువడి యిచ్చటికి వచ్చి దేవరచే పడి తిర్యగ్భావనిర్ముక్తుండ నై భవదీయదర్శనంబునఁ గృతార్థుంగుండ నైతి నని పలికి యొక్కవిన్నపం బవధరింపుమని యిట్లనియె.

26


సీ.

వేగంబ యిచ్చట వెడలంగ వలయుఁ గి
        రాతు లుద్ధతులు ద్వారమున వెడలి
పోవంగఁ గనుఁగొన్నఁ బొలియింతు రీత్రాటి
        వలన మయూరభావములు దాల్చి
యీగవాక్షమ్మున నేగుద ముని నృప
        తనయుకంఠమున నాత్రాడు గట్టె
నెమలి యై యపుడు రాకొమరుండు వెడలి త్రా
        డూడ్చి యాతని చేతి కొసఁగుటయును
నాగుణము కంఠమునఁ గట్ట నాక్షణంబ
తాను బర్హి యె వెడలి రాసూనుచేత
బంధనిర్ముక్తుడై యాత్మభావ మొంది
కడురయంబున నాపల్లె వెడలి వచ్చి.

27


వ.

తనమతమున కుల్లసిల్లుమహినాథకుమారుండునుం దానును గాననమార్గంబున నరిగి యరిగి.

28


చ.

దళ మగుచీఁకటిం దెరువు దప్పి వదంబులు నొప్పిగూరినన్
సొలసి వనంబులోన నొకశుష్కమహీజముక్రింద నుండఁగా
లలితనిశాకిరాతమహిళాకచభారవిభాసితాబ్జినీ
దళమును బోలి తూర్పుదెసఁ దారకరా జుదయించె నత్తఱిన్.

29


చ.

నెలవొడువంగఁ చిత్రముగ నీరసభూరుహ మాకువెట్టి మొ
గ్గల విరిపూవులం దనరి కాచి ఫలించినఁ దత్ఫలావళుల్