పుట:PandugaluParamardhalu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేషాదిరాశుల నామములతో బరగుచున్నవి. ఇందొకవిచిత్రము గలదు.సూర్యుడే మాసమున ఏ రాశి యంద్ సంచరించునో ఆ మాసమున ఆ స్తంభము మీదనే సూర్యకాంతి ప్రసరించునుగాని తదితర స్తంబముల యందు ప్రసరించదు. నేటికిని విడేశీయులనేకులు ఈ విచిత్రమును చూచి నివ్వెరపడుచుందురు. ఆనాటి శాస్త్ర్వికస పద్ధతులు ఈ నాటికిగూడ పాశ్చాత్యులకు లోంగలేదనిన వారెంతటి ప్రతిభాశాలులో, ప్రజ్ఞావంతులో బుధులు గ్రహింపగలరు.

                           విద్యారణ్యుడు ఆంధ్రుడు
   విద్యారణ్యస్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా, అనే శంక ఉంది.  అతని జాతి విషయకమైన చర్చ శ్రీ వావిలాల శివావధానులు 'విద్యారణ్య చరిత్ర ' లో కలదు.  అతడు ఆంధ్రుడనుటకు అనేక కారణాలు అగుపడుచున్నవి.  కావేరి తీరస్థుడు, వడమ భ్రాహ్మణుడు, అప్పయ్య దీక్షుతులు సంతతిలోనివాడు, అఖిలబారత ప్రసిద్దిగల గొప్ప విద్వాంసుడు అయిన శ్రీ రాజు శాస్త్రులు విద్యారణ్యులు ఆంధ్రడనె అభిప్రాయాన్ని దృడపరచి ఉన్నారు.
                          స్థలము: కాలము
   అతడు పుట్టిన స్థలము, కాలము సరిగా తెలియదు, వైశాఖ శుద్ద దశమి అతని జయంతి దినమని కొందఱంటారు.  అతడు సిద్ధి పొందినది `386లో అని కొందరు, 1395లో అని మరికొందరు. అతడు 102 సంవత్సరాలు జీవించెనని కొందరు 120 సం|| జీవించెనని మరికొందరు, అతడు 1321లో సన్యసించినట్లు 1331లో శృంగగిరి పీఠమధిష్టించినట్లు 1336లో విద్యానగర నిర్మాణం చేసి విరూపాక్ష పీఠం స్థాపించినట్ల్ చెబుతారు.  అతడు శృంగేరి పీఠాన్ని యాభై ఐదు సంవత్సరాలు ఏలినట్లు తెలియవస్తూ ఉంది.  ఆదిశంకరుల తరువాత అతడు పదకొండో ఆచార్యులు.
                             శారదా విగ్రహం
   శంకరుల తరువాత అతడు శంకరుని వంటివాడు.  ఆది శంకరుడు కాశ్మీరం నుండి శృంగేరి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమ విద్యారణ్యస్వామి తన హయాములో ఆశారదా విగ్రహాన్ని పంచ లోహాలతో నిర్మింపచేసి పూర్ణకుంబాలతో ఆభిఉషెకం ఛేశాడు. ఆవిగ్రహాలే నేటికి ఏఎ శృంగేరి పీఠంలో అర్చిమపబడుతూ ఉంది.  అది ఆ మమనీయుని చేతి చలవ.