పుట:Navanadhacharitra.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxv

దర్పిత వనదేవతాకరస్ఫటిక, దర్పణంబునుబోలెఁ దనరారుచున్న కొలను గనుంగొని కువలయేశ్వరుఁడు. "

ఆశ్రమవర్ణనము

నవనాథచరితమున శ్రీనగమందలి కోఁతులు వృద్ధమునులకు ఫలపుష్పమూలముల నిచ్చుట, పరభృతములు పంచాక్షరీమంత్ర పఠనముచేయుట, పాములు రంధ్రద్వారములఁ దలలెత్తి మునికుమారుల సామగానములను విని సొక్కియాడుచుండుట, శివపరాయణముచేయు సద్భక్తనివహంబునకుఁ బెబ్బులులు తమకాయంబు నొరగుగద్దియలుగాఁ జేయుట, మొదలగువాని వర్ణనము హరిశ్చంద్రలోని విశ్వామిత్రాశ్రమమందుఁ బులులు, లేళ్లు, ముంగిసలు, పాములు, పిల్లులు, మూషికములు, నెమళ్లు, పన్నగములునుదమసహజవైరమును విడిచియుండుటయుఁ గోయిలలు సామగానంబులు సల్పుట, చిల్కలు మినుకుల గఱపుట, హోమధూమము లాజ్యగంధములను వెదజల్లుటయు మొదలుగాఁ గల వర్ణనముతోఁ గొంతసామ్యము గలిగినదై యున్నది. ఇట్లు సందర్భాను కూలముగా నొకటి శైవమహాక్షేత్రమును, రెండవది వైదికాచారసంపత్తిగల ఋష్యాశ్రమమును వర్ణించుచు సందర్భరమణీయములై యున్నవి.

అట్లె నవనాధచరితమునందలి చిత్రాంగి సౌందర్యవర్ణనము, మాలెతల సౌందర్యవర్ణనముతోఁ గొంతవఱకుఁ బోలియున్నను, హరిశ్చంద్రోపాఖ్యానమందలి దింతకంటె ప్రౌఢరచనలతోడను సంభాషణలతోడను గూడియున్న దనవలసియున్నది.

నవనాథ — “గమకించియందెలు ఘల్లుఘల్ల నఁగ
                    మొలనూలు రంతుగా మ్రోయ మాణిక్య
                    కలితకంకణ ఝణత్కారంబు లెసఁగ
                    నొసపరి బాగుగా నొదవిన నడల
                    .... ...... ..... ..... ...... ..... ...... ..... .....
                   తరళహారంబుల తళుకులు చెదర
                   నెరయు వెన్నెలగాయు నెఱనవ్వుదోప
                   .... .... .... .... .... .... .... .... .... ..... ....
హరిశ్చంద్ర — “రతినాయకుని యాజ్ఞ రంతుగాఁ జాటు
                     గతినందియలు ఘల్లుఘల్లున మ్రోయ
                     మొలనూళ్లగజ్జల మ్రోఁతకు రత్న
                     కలితకంకణములు గమకంబుసూప
                     మదహంస గతులను మఱపించునడల
                     గదలు మట్టెలు తాళగతులకుఁ దాక