పుట:Navanadhacharitra.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxiv

                    కనుగొని హాస్యంబుగా వికారంబు,
                    లొనరించి వగ్గు కోఁతికి సివము వచ్చినరీతి "

హరిశ్చంద్ర- "వెక్కిరించుచుఁ గోలవిసరుచు ...
                    గంతులువైచుచుఁ గరతాళగతుల
                    నంతంత నాడుచు నంతటఁబోక
                    పలువిస్వరంబులఁ బనసలు కొన్ని
                    చెలఁగి త్రస్సలు మీఁదఁ జిలుక చెప్పుచును
                    జెనటికోఁతికి వీరసివమెత్తినట్లు -"

నవనాథచరిత్రలో సందర్భానుకూలముగ నీ విషయమును కవి చాలఁ బెంచి యీతనికిఁ గలిగిన సంతోషమునకునూచకముగ గోవింద గంతులు గూడఁ గొన్ని వేయించినాఁడు.

                 “మా వేఁడు కింతట మానదు మీకు
                  గోవింద గంతులు కొన్ని వేసెదము
                  పప్పుకూచికి నాల్గు భాస్కరు కై దు
                  అప్పలకాఱు జంధ్యాలకేశవుకుఁ
                  బదుమూఁడు గోవిందభట్టు పిన్ననికి
                  ఢేరవిఠలుకుఁ బండ్రెండు డోరాల,
                  వీరయ కెనిమిది వీధిమాధవుకు”

సామాన్యవిప్రజనసంఘమున నిట్టిపేళ్లాకాలమున వాడుకలో నుండి యుండు ననుటకు నిదర్శనముగ నిట్టిపేళ్లపట్టిక యే యొకటి పాల్కురికి సోమనాథుని “పండి తారాధ్య చరిత్ర”లోఁ గనఁబడుచున్నది.

                 “దామోద రప్పన్న వామనకూచి
                  చప్పట్లపెద్ది యంశమునూరబోతి
                  పప్పుకేశవుఁడు సంభవుల మాధవుఁడు
                 దోనయభట్టును ధూర్తవిఠ్ఠలుఁడు”

సరోవరవర్ణనమునందలి యుత్ప్రేక్ష. యీ రెండు గ్రంథములలో నొక్క రీతినె కలదు.--

నవనాథ- "వీచికాందోళన వికచారవింద, కుముద నీలోత్పల కుసుమపరాగ సముదయవాసిత సలిలమై విపిన, దేవతాకరతల స్థితదర్పణంబు కైవడిఁ గడునొప్పు కమలాకరంబు"

హరిశ్చంద్ర- “కమలనీయవిలసిత కమలకల్హార, కుముదనీలోత్పల కుసుమసుగంధ మధుకర మిథున సమ్మదకరమృదుల ... సౌరభ వాసిత సలిలమై చైత్ర