పుట:Narayana Rao Novel.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౫ ( 15 )

అ క్క చె ల్లెం డ్రు

ఆ నలువు రక్క చెల్లెళ్ళ యందమునం దెక్కువ తక్కువలు నిర్ణయించుట దుస్తరము. నలువురు నొకేయచ్చున పోతపోసిన విగ్రహములు, చటుక్కున జూచినచో బోలికలలో నేమియు వ్యత్యాసమున్నట్లు సాధారణులు గ్రహింపనేరరు. పరిశీలనాదృష్టిగలవారు ఆ నలుగురు బాలికలకు ముక్కులు, అడుగు పెదవులు, గడ్డములలో భేదమున్నదనియు, గన్నులలోని పాపల రంగులు వివిధములుగా నున్నవనియును, నుదురుకొలతలు రెండవ నాల్గవ బాలికల కొకతీరు నను, మొదటి మూడవ బాలల కొకతీరున నున్నవనియు, మొదటి యిద్దరి బాలలకు నుంగరముల జుట్టనియు, చివరి యిద్దరి బాలలకు నున్నని సమకేశములనియు, పెద్దయామెయు ఆఖరి బాలయు నిద్దరు పొట్టివారనియు, మధ్య వారిరువురు పొడగరులనియు గ్రహింపగలరు.

శ్యామసుందరి కంఠము కిన్నెర కంఠము, కలస్వనము, పంచమస్వర పూరితము.

రోహిణీదేవి గళమున కాకలీస్వనము, నిషాదస్వరశ్రుతి గలది.

సరళాదేవి గొంతు ధైవతస్వరశ్రుతి, వేణునాదపూరితము.

నళినీదేవి గళ మింక నేర్పడలేదు. కాని మధురమైనదగునని స్పష్టము.

శ్యామసుందరీదేవి వైద్యవిద్యయందు మూడవతరగతి చదువుచున్నది. ఆమె చెల్లెలు రోహిణి రాజధాని కళాశాలలో బి. ఎస్. సి. ఆనర్సు మూడవ సంవత్సరము చదువుచున్నది. మూడవ బాలిక ఇంటరు ప్రథమతరగతి. నాలుగవ బాలిక అయిదవ ఫారము.

శ్యామసుందరీదేవి కుటుంబము సంగతి నారాయణరావునకు నటరాజను చెప్పినాడు. రాజారావు తరగతిలో శ్యామతో మాటాడుచుండెనే గాని లజ్జా శీలుడగుటచే నామెతో దక్కినవారందరు స్నేహముగా నున్నట్లుండలేదు. నటరాజన్ కూడ వైద్యవిద్యార్థి, అతడు శ్యామతో, నామె కుటుంబముతో బాగుగా స్నేహమొనర్చెను. శ్యామాసహోదరీబృందము సంగీతలోలమని నారాయణరావు పరమేశ్వరులకు దెలిసినప్పటినుండియు వారచ్చటకు బోయి ఈ సంగీతము విని యానందింపవలయునని యనుకొనుచుండిరి.

పరమేశ్వరుడు స్త్రీలతో నంతలో స్నేహము చేయగలడు. నారాయణరావు తమంత తాము స్నేహము కోరివచ్చినవారితో గలసి మెలసి యుండగలడు. ఒక్క రాజారావునకే స్త్రీ లనిన తగని సిగ్గు.

నారాయణరావు నటరాజనులు వచ్చిన గంటకు గాని పరమేశ్వర రాజారావులకు శ్యామఇంటికి వెళ్ళుటకు వీలు చిక్కినదికాదు. మన మిత్రులారోజున