22
మీఁగడ తఱకలు
అని మడికిసింగన చెప్పినాఁడు. పండితారాధ్యునిచరిత్రము రచించిన సోమనాథుఁడు వాకొనలేదుగాని, వాణసవంశ్యులు కాశ్యపగోత్రులు గాన నారాధ్యదేవరకూడఁ గాశ్యపగోత్రుఁడే యనవలెను. 'చతుర్మఠనిర్ణయ' మని యిటీవల ఓరుగంట ముద్రితమయిన యొక చిన్నిపుస్తకమున నాతఁడు గౌతమగోత్రజుఁ డని కలదు. గౌరాంబా, భీమనపండితు లీతనితలిదండ్రులు. భీమనపండితుఁడు తాను శ్రీశైలమునఁ బంచాక్షరీమంత్రము జపముచేసి పడసిన సంతానముగాన, ఈ పుత్రునికి మల్లికార్జునుఁ డని పేరుపెట్టెను. దాక్షారామముచేరువనే కోటిపల్లిలో నున్న యారాధ్యదేవరదగ్గఱ నీతఁడు శైవమంత్రదీక్షఁ బడసినాఁడు. పండ్రెండవశతాబ్దియత్తరార్ధమున, 1150 నుండి 1180 దాఁక నీమహనీయుఁ డాంధ్రదేశమునఁ బ్రఖ్యాతుఁడై యుండెను. గుంటూరు మండలమందలి ధనదుపురమున (నేఁటి చంద్రవోలు) వెలనాటి చోడని యాస్థానమున నీతఁడు బౌద్ధాచార్యులతో మతవివాదము నెఱపెను.
బౌద్ధాచార్యులపై కక్ష
శ్రీకాకుళక్షేత్రమునఁ*[1] గల మల్లేశ్వరాలయమున (ఈయాలయము నేఁడును శ్రీకాకుళమునఁ గలదు) గల 'దివియకంబమును' (దీపములు వెలిఁగించు లోహస్తంభమును) బౌద్ధాచార్యులు పెల్లగించి కొనివచ్చి
- ↑ *శ్రీకాకుళక్షేత్రమునుగూర్చి యింతకుముందు నేను గొన్నివ్యాసములు వ్రాసితిని. శ్రీముఖశాతకర్ణి పేరఁగాని, 'సిరిక' యన్న బౌద్ధోపాసిక పేరఁగాని ఆయూరు వెలసియుండవచ్చును. సిరిక-పేరు బౌద్ధప్రాకృతశాసనములలోఁ గాన నగును, కాఖంది, కాక తేయ, కాకాంది - కావూరు - కావలి - పేళ్లు బౌద్ధశాసనములలోని "సిరిక" పేర వెలసియుండవచ్చుననుట సంగతతరము. కాకతీయులుకూడ ఈ పేర వెలసినవారేయని నాతలంపు. బౌద్ధశాసనములలోని కాకతేయులే యిటీవల కాకతీయు లయియుందురు. సిరికపేర కొలనితో వెలసిన యూరుగాన సిరికాకొలను, శ్రీకాకొలను, కాకోలను' అను పేళ్లు పుట్టి, క్రమముగా వైష్ణవము ప్రబలినతర్వాత కొలను 'కోళమ్' అయి శ్రీకాకొళము, కాకొళము, కాకుళము రూపములు పుట్టినవి. ఈ శ్రీకాకుళము తర్వాత ఉత్తరశ్రీకాకుళము దక్షిణశ్రీకాకుళము గ్రామములు వెలసినట్టున్నవి. దక్షిణశ్రీకాకుళము నందివర్మపల్లవుని శాసనమునఁ గాననగును. అది యెక్కడిదో గుర్తింపవలెను.