3
పండితరాధ్య చరిత్రము
శ్రీమల్లికార్డునపండితారాధ్యుని
జన్మాదిక వృత్తాంతములు - గ్రంథరచనా విశేషములు
శ్రీమల్లికార్జునపండితారాధ్యుఁడు ఆంధ్రశైవాచార్యులలో పండిత త్రయ మని యెన్నికగన్న శ్రీపతి, మంచెన, మల్లికార్జున పండితులలో మూcడవవాcడు.
జన్మాదికము
గోదావరి మండలమందలి దాక్షారామ మీయన జన్మస్థలము. ఆయూర వెలసియుండు భీమేశ్వరస్వామివారి కీతనివంశమువారు పూజారులు. పురోహితు లని సోమనాథుఁడు చెప్పినాఁడు. అర్చకులు, ఒండె స్థానపతులు కాఁదగుదురు. శివతత్త్వసారమునుబట్టి చూడంగా నర్చకులే యగుదు రని తోఁచును. ఆనాఁడు కర్ణాటాంధ్రదేశములందుఁ బేరెన్నికగన్నవాణసవంశమున నీతఁడు జన్మించెను. చాళుక్య రాజులకు మంత్రులు, ఆస్థానకవులు నయి వన్నె కెక్కినవారు వాణసవంశము వారు. శాసనములలోఁ బలుచోట్ల తద్వంశ్యప్రశంస యుండును.
ఆంధ్రభారతకర్తయగు నన్నియభట్టారకుని సహాధ్యాయుఁడు నారాయణభట్టు వాణసవంశమువాఁడు. మడికిసింగన పాద్మోత్తరఖండకృతికిఁ బతి కందనామాత్యుఁడు వాణసవంశమువాఁడు.
తే|| కశ్యపబ్రహ్మ యన జగత్కర్త పుట్టె
నతని తనువున నుదయించె నఖిలజగము
నతనిగోత్రజులందుఁ బెం పతిశయింప
వాణసాన్వయ మొప్పారె వసుధమీఁద.