పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

మీఁగడ తఱకలు

రఘునాథనాయనినాఁటి గ్రంథములెల్ల సంస్కృతాంధ్రములలో శాశ్వతప్రతిష్ఠ గాంచదగినవే కాని తేలికపాఱురచనవి గావు.

ఆంధ్రమునఁ జేమకూర వెంకటకవిగ్రంథములు సర్వసహృదయ విదితములేకదా, ఆతఁడు

"తా రసపుష్టిమైఁ బ్రతిపదంబును జాతియు వార్తయుం జమ
 త్కారము నర్ధగౌరవము గల్గ ననేకకృతుల్ ప్రసన్న గం
 భీరగతిన్ రచించి మహి మించినచో నిక నన్యు లెవ్వర
 య్యా! రఘునాథభూపరసికాగ్రణికిం జెవి సోక జెప్పఁగాన్"

అన్నాఁడు. రఘునాథరాయఁడు కృతిగొన్నగ్రంథములలో నైషధ పారిజాతీయ మొక్కటి. తద్గ్రంథకర్త కృష్ణాధ్వరి సంస్కృతాంధ్రములలో గొప్పకవి. ఆంధ్రమునకంటె సంస్కృతమున మఱీ గొప్పకవి. రఘునాథ రాయలపేర నాతడు సంస్కృతమున నైదుగ్రంథముల రచించినాడు.

"నవరస శ్రీరఘునాధభూపాలీయ"
           నామభామాభీష్టనాయకుండు
 సరస 'నైషధపారిజాత' కాహ్వయకావ్య
          వర్యాస్వయంవరవల్లభుండు
 కల్యాణ 'కౌముదీకందర్ప' నాటక
          కన్యోద్వహనబద్ధకంకణుండు
 అమరుకాహంకారహరి భంగీకశృం
          గారసంజీవనీకాముకుండు
 తాళచింతామణీవధూతత్పరుండు
 మంచిజామాత రఘునాథమనుజనేత!
 తెలియ (తెలుఁగు?) నైషధపారిజాతీయకృతియు
 నేవు రక్కలచెల్లెలై హెచ్చుననుచు.

 పరదోషా ౽ పరయోషా
 పరభాషారహితభూమిపాలకఋషికిన్
 మరుదుర్వీధరదర్వీ
 కరగుర్వీడ్యప్రతాపఘనశేముషికిన్,