పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజా సర్ రామవర్మ

287



బాలకుల యుపయోగము నిమిత్తము రామవర్మ యింగ్లీషులోనుండి సత్పురుషులయొక్కయు మంచి స్త్రీలయొక్కయు చరిత్రముల నేరి మళయాళభాషలో వ్రాసెను. మఱియు స్వభాషాభివృద్ధిఁ జేయుట కతఁడు "విద్యావిలాసిని" యను పేరనొక మాసపత్రికనుస్థాపింపఁ జేసి జ్యోతిశాస్త్రాది విషయములను సులభశైలిలో మళయాళభాషలో వ్రాసి యందు బ్రకటించుచు వచ్చెను. చిన్నతనము నుండియు వానికి దేశయాత్రాభిలాష మెండుగ నుండుటచే రాజ్య భారముపై బడిన కతమున వెనుకటియట్లు స్వేచ్ఛగా దిరుగ వలనుపడకున్నను రామవర్మ యుత్తరహిందూస్థానమును జూచి వచ్చెను. తీరిక చాల లేకపోయినందున నతఁడు 1882 వ సంవత్సరమున జనవరి నెలలో బయలుదేరి ముఖ్యస్థలముల గొన్నిఁటిని మాత్రమే చూచి మార్చినెల ముగియకమున్నె రాజధాని జేరెను. అతఁడు చూచిన ప్రతిపట్టణమునందు జనులు వానిదరిశనము జేయవచ్చి వానియుదార గుణముల గొనియాడుచు స్వాగతపత్రికల సమర్పించిరి. 1883 వ సంవత్సరమున నతఁడు చెన్నపురమునకుఁబోయి వెనుకచేసిన కాశియాత్రసఫలము చేయుటకు రామేశ్వరయాత్రచేసెను. రామేశ్వరము నుండి సేతువునకు బోయినపుడు రామవర్మ మహానందభరితుఁడై దినచర్యలో నిట్లు వ్రాసెను. "నేను నేటియుదయమున సముద్రపు బాయ దాఁటితిని. పూజ్యమైన రామసేతువు జూచితిని. ప్రకృతియో దైవమహిమయో నేనెఱుఁగనుగాని యిది మిక్కిలి దర్శనీయమైనది. సమానమైన వెడల్పుఁగలిగి యది గీటుగీచినట్లు తిన్నగ నున్నది. ఈ భాగమే మా దేశమును సింహళద్వీపమును గలుపుచున్నది." రామవర్మ తన రాజ్యములోఁగూడ బూర్వులకంటె నెక్కుడు సారులు పయనములుచేసి పలుతావులు చూచెను. ఆయన తన రాజ్యమునందుఁ గల ప్రతిగ్రామమునకుఁ బోయి చేతిపనులకు గాని