పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాఉపన్యాసమును ఆనందముతో వినిరి. సూర్యప్రకాశరావుగారు అనుకూలాభిప్రాయమును వెల్లడించిరి. వీరు గోదావరిజిల్లాసంఘకార్యదర్శిగా నుండి, చిరకాలము దీక్షతో పనిచేసిరి. భూముల నీటివసతులు మొదలగువానినిగూర్చి పలుమారు ప్రభుత్వమువారికి అర్జీలుపంపి, రహితుల కష్టముల నివారణచేయు చుండిరి. వీరివ్రాతలు విషయపరిజ్ఞానము కలిగి, మిక్కిలి సహేతుకముగ నుండెడివి. సంఘసంస్కరణమునందును అభిమానము గలదుగాని వారికృషి యెక్కువగ స్థానికప్రజల బాధానివారణ చేయుటలో వినియోగింపబడుచుండెను. కనుక కాకినాడపౌరులలో వీరిది గురుస్థానము. వీరు పూర్వార్జితమువలన స్వతంత్ర జీవనము సలుపు సంపన్నగృహస్థులు.

3, 4 విశాఖపట్టణం, కాకినాడ

______________________

మూడవ ఆంధ్రమహాసభ విశాఖపట్టణములో 1914 వేసవిలో జరిగినది. శ్రీ పానుగంటి రామారాయణింగారు యం. ఏ. పట్టభద్రులు, ఆంధ్రభాషాప్రవీణులు. కేంద్రశాసనసభలో సభ్యులు. నేను వారిని కలుసుకొని ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహింపుడని కోరితిని. ఆయన రాష్ట్రనిర్మాణవిషయము కొంతవడి నాతోచర్చించి తుదకు అధ్యక్షతవహించుటకు కంగీకరించిరి. శ్రీభూపతిరాజు వెంకట్రాజుగారు శాసనసభలోసభ్యులు. విశాఖపట్టణములో ప్రముఖులగు న్యాయవాదులు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణవిషయమున పూర్ణముగ నభిమానముకలవారు. వారు సన్మానసంఘాధ్యక్షోపన్యాసములో దానినిగూర్చి గట్టిగ పోషించిరి. పానుగల్లురాజాగారు మొదటి సంశయములెల్ల విడనాడి