పుట:Kavijeevithamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

65



నకు గజవక్త్రుండునుంబోలె గురునాథుం డీకవికిఁ దగియుండె నని కొనియాడిరి. అనంతర మనుదినంబును వీ రీగ్రంథంబు దివాభాగంబున నారంభించి దినాంతంబునఁ బరిసమాప్తి నొందించి నిశాంతంబులకు జనుచుందురు. ఇట్లుండికొలఁది కాలంబులోపల విరాటపర్వంబు, నుద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యపర్వంబులు సాంతంబుగఁ జేసి రాజున కొసంగిన నాతండును దత్సభాసదులును దిక్కనపదలాలిత్యంబునకును, శబ్దసౌష్ఠవమునకునుఁ గల్పనాచమత్కృతికిని శయ్య నేర్పునకును సంగ్రహఫక్కికిని సందర్భనైపుణికిని నెంతయు సంతసించిరి. మఱికొందఱు సోమయాజి కవనంబు చూచి యోరువలేమిచే నీతఁడు సామాన్యవృత్తంబులఁ గొన్నిటి నేర్చి కాలము గడుపుచున్నాఁడు. ఈతనిబండార మింతియ. విశేష వృత్తంబులవాఁడు గాఁడు. సాహితీపటిమయు నంతమాత్రంబే. దూరపుఁగొండలు నును పన వినమే. అని యాతని నిరసించుచు నచ్చటచ్చట బల్కసాగిరి. అట్టివారిపల్కు లన్నియు నాతనిచెవికి ముల్కులై సోఁకిన నాతఁడు మృదువృత్తంబుల కిది తఱి గా దని యెంచి సౌప్తిక స్త్రీపర్వంబుల రెంటిని కఠినతరవృ త్తసమన్వితంబులుగాను సంస్కృతజటిలంబులుగను నొనర్చె. వానిం జూచి యితనికి ఛందంబునఁ గలప్రజ్ఞకు నందఱును నలరిరి. కాని యం దొకరైన నీతనియభిప్రాయంబును దెలిసికొనరైరి. కావున నీతఁడు తనసాహితీపటిమను జూపఁ దలంచి శాంత్యాను శాసనికపర్వంబులు రెండును చెప్పుచో ననేకసంస్కృతజటిలవాక్యంబులు నచ్చ తెనుఁగువాక్యంబులను గుప్పించెను. ఆశైలిం జూచి పండిత జనంబు లెల్ల నాహారవంబుల నీకవిశిఖామణిసామీప్యంబున కేతెంచి యిట్టికఠినశైలి సర్వజనదురవగాహంబు. పండితపామరజనసుగమం బగు న ట్లీవఱకుఁ జెప్పి యిపు డిటు వ్రాయుటకుఁ గారణంబు కానరాదు. అనుడుఁ దిక్కన నవ్వి పండితపామరుల నిర్వుర మెప్పించుట ముఖ్యంబు గావున నే నట్లొనరించితిని కొందఱకు మార్దవంబైనచో రుచ్యంబు. మఱికొందఱకుఁ గఠినంబైనచో నిష్టంబగును. కఠినంబు గోరువారికిఁ గఠినంబుగ నుండుటయే కర్జంబు గదా. కవి వీరి నందఱ సంతుష్టి