పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11.కందనూరు నవాబు రాజరికం

[ఇది కల్పితకధ కాదు; నిజంగా జరిగినసంగతి. 1836 వ సమత్సరం వరకూ కర్నూలుజిల్లాలో నాలుగు తాలూకాలు కర్నూలు నవాబురాజ్యంలో చేరివుండేవి. శ్తీశైలము, అహోబిలము, నివృత్తిసంగమము మొదలైన పుణ్యక్షేత్రాల కు పోయే యాత్రికుల దగ్గిర ఆ నవాబు గారు 'హాశ్శీలు '(పన్ను) వసూలేసేవాడు. శ్రీశైల దేవస్థానము చాలా దుస్థితిలొ వుండేది. ఇలా వుండగా ఈ నవాబుగారు ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వాన్ని తిరగదోడడానికి కుట్రచేసిన సంగతి బయటపడింది. అంతట కుంఫినీవారు ఆయన రాజ్యాన్ని లాక్కున్నారు. శ్రీశైలాన్ని కొన్నాళ్లు కుంఫిణీవారే పరిపాలించి తరువాత 1840 లో పుష్పగిరి శంకరాచార్యులవారివశంచేశారు.]

కందనూరు, కందవోలు, కదినవోలు అనేవి కర్నూలుకు పాత పేర్లు. కందెనవొలు అనేదే అసలుపేరు. క్రీస్తుశకం 1775 వ సం॥లో అధ్యాత్మరామాయణం వ్రాసిన పెద్దనసోమయాజి కందవోలు అని ప్రయోగించాడు. కొందరు కవులు కందవోలు అనికూడా వాడారు విజయనగరసామ్రాజ్యంనాటి కైపీయతులలో కందవోలు, కందమాలు అనె రెండుపేర్లూ కబపడ్తున్నాయి. అయ్యలరాజు నారాయణకవి తన హంసవింశతిలో ఊళ్లపేర్ల జాబితా నివ్వడంలో 'కందనూరు ' అని ప్రయొగించారు. 1830-31 లో కాశీయత్రచరిత్రను వ్రాసిన ఏనుగుల వీరాస్వామయ్యగారుకూడా కందనూరు అనే ప్రయోగించారు.

ఇప్పటి కర్నూలు జిల్లాలొ రామళ్ళకొట, నందికొట్కూరు, నంధ్యాల, శ్రివెళ్ళ, కంభము, మార్కాపురము, కోయిలకుంట్ల లేకాండ అనే ఎనిమిది తాలూకాలున్నాయి. రామళ్లకోటకు ..... ముఖ్యపట్టణం. శిరివెళ్ళకు ఆళ్లగడ్ద, కంభానికి గిద్దలూరు తాలూకాలకు ఆతాలూకాపేర్లుగల గ్రామాలూ ముఖ్య పట్టణాలు. జిల్లా విస్తీర్ణం 7504 చదరపుమైళ్ళు, జనాభా షుమారు ......... రివిన్యూ ఆదాయం 23 1/2 లక్షల రూపాయలు.

పూ ర్వ చ రి త్ర

కర్నూలు మండలం హంపీ-విజయనగర చక్రవర్తుల క్రిందికి వచ్చినప్పటినుంచీ ఈజిల్లా చరిత్రయొక్క