పుట:Kashi-Majili-Kathalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజనీతి

37

బాలింపుమని రాజనీతి యంతయు నతని కుపదేశించెను.

అప్పుడు చంద్రాపీడుఁడు శుకనాసుని వాక్యాంబువులచేతఁ బ్రక్షాళితుండువోలె నభిషిక్తుని పదిగి నభిలిప్తుని చందమున నలంకృతునిభాతిఁ ప్రీతహృదయుండై కొండొకవడి ధ్యానించి యతని యనుమతి నాత్మీయభవనమునకుఁ బోయెను.

అంతటఁ దారీపీడుఁడు శుభముహూర్తమునఁ జతుస్సముద్ర జలంబులందెప్పించి బ్రాహ్మణాశీర్వాద పురస్సరముగాఁ జంద్రాపీడుని యౌవరాజ్య పట్టభద్రునింజేసెను.

అప్పుడు ప్రజలందరు నానందసాగరమున నీదులాడిరి. చంద్రాపీడుఁడు సింహాసనమెక్కిన గొద్దిదినముల కే తండ్రియనుమతివడసి శుకనాసుని శాసనప్రకారము చతురంగ వాహినీ పరివృతుండై వైశంపాయనుఁడు తోడరాఁ జిత్రలేకతోఁగూడ దిగ్విజయయాత్ర వెడలి క్రమంబునఁ బూర్వదక్షిణ పశ్చిమోత్తరదేశములఁ దిరిగి శరణాగతుల రక్షించుచు దుర్మార్గుల శిక్షించుచు భీతుల నోదార్చుచు రాజపుత్రుల కభిషేకము జేయించుచు రత్నముల స్వీకరించుచు నుపాయనములఁ గైకొనుచుఁ బన్నులఁ దీసికొనుచు విజయచిహ్నము లాయాచోటుల స్థాపించుచు శాసనముల లిఖింపుచు బ్రాహ్మణులఁ బూజించుచు మునుల కాశ్రమములఁ గల్పించుచు బరాక్రమమును వెల్లడించుచు గీర్తిని వెదజల్లుచు భూమండలమంతయు దిరిగి విజయస్థంభంబుల నాఁటి మరలి తన పురంబున కరుదెంచుచు నొకనాఁడు కైలాస సమీపమునఁ జరించెడు హేమజటులను కిరాతులకు నివాసస్థానమై పూర్వసముద్రమున కనతిదూరములోనున్న సువర్ణపురమును జయించి స్వీకరించెను.

మఱియు రాజపుత్రుఁడు ఆ నగరమందు నిఖిల ధరణితల