అయిదవ అధ్యాయము
దనుగ్రహమువలన జయించి తీరెదమను దృఢవిశ్వాసము గలిగి
యుండిరి. ఆమె పేరు విని దయ్యాల పోతనియు సైతాను యొక్క
బలముచే తమ్మును. నాశనము చేయుటకే వచ్చి నిదనియు ఆంగ్లే
య సైనికులు మిగుల భీతిఁ జెందిరి. పరాసు సేనలు ఆమెయొక్క
ప్రోత్సాహమువలన బహుసాహసముతో పోరాడి ఆంగ్ల సేనల
నోడించి ఆర్లీయస్సులో ప్రవేశించిరి. లోపలనున్న ప్రజలు కూడ
బయటికి వచ్చి ఆంగ్లేయులను ముట్టడించిరి. మే నెల 8 వ తేదిన
వారి సేనాధిపతులునుచే చాలవరకు సైన్యములును హతులు కాగ
ఆంగ్లేయులును, బర్గండీ యులును మందుగుండు సామగ్రిని వదలి
పారిపోయిరి. సేనలును ప్రజలును వారి వెంటనంటి చంపదలచి
రిగాని, "వారిని పోనిండు; వారి వెంటబడి చంప వలదు.ఈది
సము సబ్బాతుదినము," అని జోను చెప్పినందున మానివైచిరి.
మే 18 వ తేదిన ఆమె తిరిగి రాజును దర్శించి రైమ్సునకువచ్చి
కిరీట ధారణము గావింపుమని కోరెను. రైమ్సుకు రాజు బయ
లు వెడలెను. త్రోవలో పేటేయివద్ద ఇంగ్లీషు సైన్యముల నోడిం
చెను. ఇంగ్లీషు సైనికులలో చాలమంది హతులైరి. వారి
సేనానులు పరాసు వారిచే ఖయిదుచేయబడిరి. ఆ ప్రాంతము
లన్నియు పరాసురాజు స్వాధీన మయ్యెను. ట్రాయిసు, షాలా
న్సు పట్టణములు పరాసు రాజు వశమయ్యెను. ప్రతిచోటను
ప్రజలాయనను ఆదరించిరి. తుదకు జులై 18 వ తేదిన జయ
ప్రదముగా రాజు . రైమ్సును చేరెను. అది బర్గండి రాష్ట్రములో
నిది, అచటి ప్రజలుకూడ పరాసురాజుకు లొంగిరి, జూలై
17 వ తేదిన పరాసురాజగు - ఏడవచార్లెసు పట్టాభిషిక్తుడై
--