పుట:Dvipada-Bagavathamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

47

నీపుత్రమిత్రులు నీశరీరంబు
నీపురి యీరాజ్య మింతయు మిథ్య
మేలుగీడును గడ మి మ్మొందుఁ గాని
కాలంబుచేతఁ గ్రాఁగనివారు లేరు
హరి పాండుపుత్రుల కాత్మబాంధవుఁడు
హరి సంతసించుట యది లెస్స మనకు
చిత్త మేభంగియో చెప్పితి"నంత
నుత్తరం బీఁజూచి యొయ్యనఁ బలికె
“నీ వాడినన్నియు నిజమంటి, తెఱఁగుఁ
గావింతు నట దైవగతి యెట్టిదగునొ?
[1]అమృతతుల్యములు నీవాడు వాక్యములు
కమలనాభునకు నీక్రమ మెఱిఁగింపు.”
మని పల్కి, హరి కుపాయన మిచ్చి యతనిఁ
దనరారఁ బూజించి దయ వీడుకొల్ప
నరిగి పాండవులతో నంతయుఁ జెప్పి
యరయ సౌఖ్యము నొంది యక్రూరుఁ డంత,510

కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట


అస్తియు.............నను కంసుభార్య
లస్తికుండలను మగధాధీశు సుతలు
హరిచేతఁ దమభర్త యడఁగిన దుఃఖ
పరవశలై తండ్రిపాలి కేతెంచి
యడుగులపైఁ బడి యడలూనఁ జెప్పఁ

  1. యమిత