పుట:Dvipada-Bagavathamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మధురకాండము

గడురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె
“ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె!
భూమి నయాదవంబుగ సేయవలయు"

మగధేశుఁడు యాదవులపై దండెత్తుట


నని పల్కి, యందంద ననిభేరి వేయ
ఘనభాంకృతుల నబ్ధిగలఁగ సైనికుల
నీక్షించి మొనలేర్చి యిరువదినాల్గు
యక్షోహిణులఁ గూడి యటవచ్చి మధుర
వెడలె మైముచ్చుట విడిసిన ప్రజను
వొడకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదు
లగువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁ
దగఁ జేయ వేగ నందఱుఁ జూచుచుండ

యాదవమాగధుల యుద్ధము


దివ్యరథంబులు దివ్యాయుధములు
నవ్యోహగతి వచ్చి హరిమ్రోల నిలిచె
నప్పుడు కమలాక్షుఁ డన్న నీక్షించి
“తప్పక చూడు యాదవకోటి నెల్ల
మడియఁగాలంబన మనమీఁద నాజి
నడచి వచ్చిరి వీరి నడఁపక నుండ
నొండుపాయంబున నుడుగునే వీడు?
దండిమీరిన యాయుధంబులుఁ బూను”
మనవుఁడు ముసలము శూలమునుఁ బుచ్చు