పుట:Dvipada-Bagavathamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ద్విపదభాగవతము

లందఱిసేమంబు లడిగితిమనుఁడు;
యేనాఱుదినముల యీలోనె నచటి
కే నేగుదెంచెద నీవంతమాను”.
మని వారి నూరార్చి యనుప నందుండుఁ
జనియె గోపాలకసమితియుఁ దాను.
అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్య
సంతోషలీలలు సలిపి రింపొంద.
మరునాఁడు శౌరి కుమారులఁ జూచి

శ్రీకృష్ణుఁడు తనగురువగు గర్గ్యునివద్ద విద్యల నభ్యసించుట


తెరగొప్ప సద్గురుద్విజుల రప్పించి
కాలోపనయనసంస్కారాదివిధులు
గాలోచితక్రియగతులుఁ జెప్పింప
యదుకులాగతగురుఁడగు గర్గ్యువలనఁ
జదువొప్ప వేదశాస్త్రము లభ్యసించి
యెఱుక సాధింపుడంచను విప్రునింట
యఱవదినాల్గువిద్యలు నభ్యసించి300

శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణ గోరుమనుట


గురువులఁ బూజించి కొలిచి మన్నించి
“గురులార! యేనీకు గురుడక్షిణార్థ
మిరవార మదినున్న యీప్పితార్థములఁ
దరమిడికొనివత్తు దయ వేఁడు” మనిన
నతఁడు భార్యయుఁ దాను నటవిచారించి
హితబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.