పుట:Dvipada-Bagavathamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

మధురకాండము

నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!"
అనుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచి
వినయంబు నీతియు వెలయ నిట్లనియె.
“యాదవులకు రాజ్యమర్హకృత్యములు
గాదు యయాతివాక్యముఁద్రోయరాదు;
కావున సామ్రాజ్య కమనీయలక్ష్మి
నీవె పాలించి మన్నించు, బాంధవుల
రప్పించి వారికి రాజ్యంబు లిచ్చి
తప్పక మమ్మెల్ల దయ నేలుకొనుము.
నిఖిలభూపతులును నింపు సేయంగ
సుఖలీలనుండు; కంసుని వంతమాను”.
మనిపల్కి యాతని నవనీభరంబుఁ
గొనకొనుమని నీయకొలిపి మురారి

శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట


బలుఁడుఁ దానును నందుపాలి కేతెంచి
కలిసి యాతనిఁ జిక్కకౌఁగిటఁ జేల్చ
భోజాధిపతియింటఁ బొలుచు వస్తువులు
రాజ్యయోగ్యములైన రవణంబు లిచ్చి
యతని మన్నించి నెయ్యము తియ్యదనము
నతిగారవంబున నమర నిట్లనియె.290
“నీవు నీసతియును నెమ్మిఁబోషించి
ప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేము
తల్లియుఁ దండ్రియు ధనము లియ్యమును
నెల్లబంధువులును నిట మాకు నీవ;
మందలోపలికి నెమ్మది నేఁగి మీర