పుట:Dvipada-Bagavathamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ద్విపదభాగవతము

బాలభానుప్రభాప్రతిమానవస్తు
హారకుండలకిరీటాకల్పకలితు
నారాయణాత్మజు నారీసమేతుఁ
గనుఁగొని కృష్ణుగానోపు ననుచు
ననుమానమును బొంది యా కాంత పలికె.
“సుందరాంగుండేరి సుతుఁడకో! ఈ తం
డెందుండి వచ్చెనో! ఎవ్వడో! ఇతని320
నేయమ కనియనో! ఈ కుమారకుని
యేయింతినోచెనో! ఇతని కౌఁగిటికి!”
అనిపల్కి తనకన్న యర్భకుఁ దలఁచి
స్తనములుఁ జేప బాష్పములుబ్బి నేలఁ
జింద "నేఁ గాంచిన శిశువు ప్రాణంబు
లిందాక నుండిన నింతె కాకున్నె!”
హరియెడ నాతని యంగంబు సొబగు
మెరమెరఁదోఁప నర్మిలిపేర్మిమాన
దన వసుదేవుఁడు హరియును బలుఁడు
జనుదేర దేవకీసతులును దాను
మారుని యాకార మహిమ వీక్షింప;
నారదుండేతెంచి నలినాక్షుఁ గాంచి
యెసఁగ బాలుని పురిటింటిలోనుండి
యసుర యెత్తుకఁబోయినది యాదిగాఁగ
చెప్పి నీపుత్రుఁడు చిత్తజుండీతఁ
డిప్పొలంతుక కోడలిది రతిదేవి
యని చెప్పి నారదుండరుగ నందఱును
మనముల సంతోషమగ్నులైరంత.