పుట:Dvipada-Bagavathamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

93

కడువేడ్క రుక్మిణి కదియంగ వచ్చి
కొడుకుఁ గోడలి నెత్తుకొని కౌఁగిలించి330
వసుదేవదేవకీవనజాక్షహలుల
కెసలార మ్రొక్కించి యింపులఁ బొదలె.
పురిఁటిలోఁ జెయిదప్పి పోయిన కొడుకు
మరలి యిన్నేండ్లకు మగువయుఁ దాను
నేతెంచె హరిభాగ్య మెట్టిదో! అనఁగఁ
జాతుర్య సుఖలీల సలిపె మురారి.

సత్రాజిత్తుని వృత్తాంతము


అంత సత్రాజిత్తుఁడను రాజవృషభుఁ
డెంతయు భయమంది యిందిరావిభుని
కాస్యమంతకముతో నమృతాంశుమండ
లాస్యక నిచ్చెదమని చెప్పుటయును
వెఱఁగొంది యారాజు వెన్నునికేల
వెఱచి యమ్మణితోన వెలఁది నెట్లిచ్చె
నాకథఁ జెప్పవేయని వేఁడ శుకుండు
ప్రాకటంబుగఁ గురుప్రవరుతో ననియె.
అనఘ! సత్రాజిత్తుఁడను ధరాధీశుఁ
డినుగూర్చి తపమాచరింప సౌతనికి
మెచ్చి వరంబిచ్చె మిహిరుండు వేఁడ
నిచ్చె స్యమంతాఖ్య నెసఁగు రత్నంబు
నామణి వక్షంబునందొప్పఁ దాల్చి
తామరసాప్తుఁ డితండకో! యనఁగ340
ధరణి యేలుచునుండి ద్వారకాపురికి